భారత దేశ సైన్యంను సరిహద్దు వెంబడి ఎప్పటికప్పుడు కవ్విస్తూ భారత భూభాగంను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న చైనా ఎన్నో కుయుక్తులు పన్నుతోంది. ఇండియన్ ఆర్మీ వారిని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా చైనాను తప్పుబడుతున్న నేపథ్యంలో కొత్త మార్గంలో ఇండియాను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ విషయంలో జనాలకు ఎక్కువగా అవగాహణ లేదు. దాంతో ఇప్పుడు అమాయకులను మోసం చేసేందుకు చైనా సైబర్ యుద్దం మొదలు పెట్టింది.
చైనా వారి వద్ద భారతీయులకు సంబంధించిన ఈమెయిల్స్ మరియు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా సైబర్ దాడులు నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం కరోనాతో భయభ్రాంతులకు గురి అవుతున్న జనాలను దాంతోనే మోసం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా కోవిడ్ సాయం కోసం క్లిక్ చేయండి అంటూ ఈమెయిల్స్, వాట్సప్ మెసేజ్లు వస్తాయి. ఒకవేళ ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే మీ ఫోన్ను వారి చేతిలో పెట్టినట్లే. కనుక అలాంటి లింక్స్ తో జాగ్రత్తగా ఉండండి. చైనాతో పాటు ఉత్తర కొరియా మరియు పాకిస్తాన్కు చెందిన సైబర్ నేరగాళ్లు కూడా ఇండియాపై పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ దేశ నిఘా విభాగం హెచ్చరించింది.
714329 800425Hey, you?re the goto expert. Thanks for haingng out here. 756902
764769 115085you can have a amazing weblog here! would you wish to make some invite posts on my weblog? 950162
986880 514121This web site could be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will undoubtedly discover it. 834561
776871 668269Quite effectively written story. It will be helpful to everyone who utilizes it, as nicely as myself. Maintain up the excellent work – i will undoubtedly read much more posts. 367938