పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. రాష్ట్ర క్యాబినెట్ లో పీఆర్సీకి ఆమోదముద్ర వేయడంతో సమ్మె చేసేందుకే ఉద్యోగ సంఘాలు మొగ్గు చూపాయి. ఈక్రమంలో నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు ఐక్య కార్యాచరణ రూపొందించాయి. ఈక్రమంలో సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఈ నెల 23న జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నాయి. 25న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తారు. 26 న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాల సమర్పించాలని నిర్ణయించారు. 27 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ, ఫిబ్రవరి 5నుంచి సహాయనిరాకరణ ఉద్యమాలు చేపట్టనున్నారు. ఈమేరకు ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణను ప్రకటించాయి. దీంతో ప్రభుత్వానికీ, ఉద్యోగ సంఘాలకీ మధ్య నువ్వా-నేనా అనే పరిస్థితులు తలెత్తాయి.
805650 73568Following study several with the weblog articles for your site now, and that i genuinely like your method of blogging. I bookmarked it to my bookmark internet site list and are checking back soon. Pls consider my internet website too and inform me what you consider. 232367
692168 306604Some truly nice and utilitarian information on this internet site , besides I think the layout holds great functions. 922038