కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది నిర్లక్ష్యం. ఆ విషయం ఇంకోసారి స్పష్టమయ్యింది. కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతోన్న వ్యక్తులు అగ్ని ప్రమాదం కారణంగా చనిపోవడం.. అదీ కోవిడ్ కేర్ సెంటర్లో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది.
ప్రమాదంలో గాయపడ్డ బాధితుల్ని రక్షించడానికి ఫైర్ సిబ్బంది చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న దరిమిలా, వారిని రక్షించేందుకోసం పీపీఈ కిట్లు ధరించి కొందరు, మాస్క్లు ధరించి కొంతమంది.. సిబ్బంది చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మొత్తం 40 మంది ఆ సమయంలో కోవిడ్ కేర్ సెంటర్లో వున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన భవనం స్వర్ణ ప్యాలెస్.. విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్. కరోనా వైరస్ నేపధ్యంలో ఈ హోటల్ని కోవిడ్ కేర్ సెంటర్గా విజయవాడలోని ఓ ప్రముఖ హాస్పిటల్ వినియోగిస్తోంది. కోవిడ్ కేర్ సెంటర్ విషయంలో ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వుండాలి. ఆ తనిఖీలే సరిగ్గా నిర్వహించి వుంటే ఇప్పుడీ ప్రమాదం జరిగి వుండేది కాదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.
మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించి, ఒక్కో మృతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా వుంటే, తమ బంధువుల ఆచూకీ తెలియడంలేదంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు బాధితుల కుటుంబ సభ్యులు. తమ వారు జీవించి వున్నారా.? మరణించి వున్నారా.? అన్నదానిపై అధికారులు ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి.
390241 972894I adore your wordpress internet template, wherever would you download it from? 681556