రాజకీయాల్లో విలువలు ఎంత అధమ స్థాయికి దిగజారిపోయాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. దేశంలో ఈ తరహా రాజకీయాలు బీజేపీ హయాంలోనే చోటు చేసుకుంటుండడం గమనార్హం. భారతీయ జనతా పార్టీ ఇటీవలి ఎన్నికల్లో మహారాష్ట్రలో అత్యధిక సీట్లు సాధించింది.. అయితే, అధికారం చేజిక్కించుకునేలా మెజార్టీ సీట్లు గెలవలేకపోయింది.
నిజానికి శివసేన – బీజేపీ కూటమిగా ఏర్పడి ఆ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ లెక్కన, కూటమి అధికారంలోకి రావాల్సి వుంది. కానీ, కూటమికి పెద్ద షాకిచ్చింది శివసేన. ముఖ్యమంత్రి పదవి పంపకం విషయంలో బీజేపీ మాట తప్పిందంటూ శివసేన, కూటమి నుంచి బయటకు రావడంతో అసలు రాజకీయం మొదలైంది.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగాయి. ఇంతలోనే ఢిల్లీ బీజేపీ చక్రం తిప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, ప్రధానితో భేటీ అయ్యాక కూడా శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ కలిసి అధికారం చేపడ్తాయని అంతా అనుకున్నారు.
కానీ, ఏమయ్యిందో.. ఈ రోజు ఉదయం దేశ ప్రజలకు షాకిచ్చేలా మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇంతకీ, శివసేన – కాంగ్రెస్లకు ఎన్సీపీ షాకిచ్చినట్లేనా.? ఎన్సీపీలో చీలిక వచ్చిందా.? కొద్ది సేపట్లో ఈ వ్యవహారంపై క్లారిటీ రాబోతోంది. రాత్రికి రాత్రి రాజకీయ సమీకరణాలు మారిపోవడమంటే ఇదేనేమో. ఈ రోజు పత్రికల్లో హెడ్లైన్స్కీ, జరిగిన పరిణామాలకీ అస్సలేమాత్రం పొందన లేకపోవడం గమనార్హం.
157213 975282This internet web site is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and you will certainly discover it. 129777
390848 553808I dugg some of you post as I thought they were really beneficial handy 416527