లివ్ ఇన్ రిలేన్షిప్ (సహజీవనం) సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యమైన బంధం కాదని పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషినర్లు తార్న్ తరన్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల గుల్జా కుమారి, 22 ఏళ్ల గురువిందర్ సింగ్. వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు.
ఈ క్రమంలో వారు తాము కలిసి నివసిస్తున్నామని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని కోర్టుకు తెలిపారు. గుల్జా కుమారి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని గురువిందర్ సింగ్ పేర్కొన్నాడు. తమకు రక్షణ కల్సించాల్సిందిగా కోరుతూ వారిద్దరూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘పిటిషినర్లు లివ్ ఇన్ రిలేషన్కు ఆమోద ముద్ర కోరుతున్నారు. కానీ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదు’ అని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.