జూనియర్ డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్ సర్జన్ మెడికల్, హౌస్ సర్జన్ డెంటల్కు 19,589 నుంచి 22,527 పెంపుతోపాటు.. పీజీ డిగ్రీ, డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్ కు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈరోజు స్నేహ సోమారెడ్డి అనే డాక్టర్ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ‘‘సార్ కరోనా కష్ట కాలంలో మీరు ఎందరికో సహాయం చేస్తున్నారు. కానీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో నిరంతరం సేవలందిస్తున్నారు. నాలుగు నెలల నుంచి మాకు జీతాలు అందడం లేదు. కోవిడ్ డ్యూటీలకు హాజరైన వారికి ఇతర రాష్ట్రాల్లో ప్రోత్సహకాలు ఇస్తున్నారు. మాకు ఇలాంటివి ఏం అందడం లేదు. మా ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎలా వర్క్ చేయగలం సార్’’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఈరోజు మీకు స్టైఫండ్ పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉత్తర్వులు జారీ అవుతాయని రీట్వీట్ చేశారు. చెప్పినట్టే మధ్యాహ్నం 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
515559 934769Some truly very good content on this web internet site , appreciate it for contribution. 724865
272501 304252Would adore to constantly get updated wonderful internet weblog ! . 506140
477035 161142I got what you mean ,bookmarked , extremely good internet website . 26723
498925 556682I must admit that this really is one wonderful insight. It surely gives a company the opportunity to get in on the ground floor and actually take part in creating something particular and tailored to their needs. 178920