కుటుంబసభ్యులకు ఏమన్నా జరిగినా.. వారి గురించి వినకూడని మాట విన్నా తట్టుకోవడం కష్టం. చేసే పనిపై మనసు లఘ్నమవదు. జ్ఞాపకాలు వెంటాడతాయి.. ఆలోచనలు కుదిపేస్తాయి. అటువంటిది కన్న తండ్రి లేడనే వార్త అందితే.. రాకూడని పరిస్థితులు ఏర్పడితే.. ఆ బాధ వర్ణానాతీతం. అటువంటి కష్టాన్నే అనుభవించాడు ఓ క్రికెటర్. తండ్రి మరణించాడని తెలిసినా బరువెక్కిన హృదయంతోనే ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు పంజాబ్ ఆటగాడు ‘మన్ దీప్ సింగ్’.
ఐపీఎల్ 2020లో శనివారం సన్రైజర్స్తో పంజాబ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే తండ్రి మరణించినట్లు మన్ దీప్ కు తెలిసినా మ్యాచ్ ఆడాడు. మనసులో బాధను దిగమింగుకునే ఓపెనర్గా వెళ్లి 17 పరుగులు చేశాడు. మనదీప్ తండ్రికి నివాళి అర్పిస్తూ జట్టు సభ్యులందరూ నల్ల బ్యాడ్జీలను ధరించే మ్యాచ్ ఆడారు.
శనివారమే జరిగిన మొదటి మ్యాచ్లో కోల్కతా ఆటగాడు నితీశ్ రాణా విషయంలో కూడా ఇదే జరిగింది. తన మామయ్య మరణించినట్టు వార్త అందింది. ఆ బాధనంతా మనసులోనే ఉంచుకుని మ్యాచ్ ఆడాడు. 53 బంతుల్లో 81 పరుగులు చేసి అంత బాధలోనూ హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. అర్ధ సెంచరీ పూర్తయ్యాక సురేందర్ అని రాసి.. 63 నెంబర్ (తన మామయ్య వయసు) ఉన్న జెర్సీని నితీష్ రాణా చూపించాడు.
వీరిద్దరూ బయో బబుల్లో ఐపీఎల్ ఆడుతూండడం వల్ల భారత్కు రాలేని పరిస్థితి నెలకొంది. భారత్కు వారు వచ్చినా నేరుగా ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో వారు దుబాయ్లోనే ఉండిపోయారు. కొన్నేళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ తండ్రి మరణించిన మరునాడే మ్యాచ్ ఆడాడు.
315435 985557Spot on with this write-up, I truly assume this site needs considerably far more consideration. Ill probably be once much more to read far a lot more, thanks for that info. 597648