ప్రేమ.. రెండక్షరాల పదమే. కానీ ఇది చేయించే పనులు ఎన్నో. తల్లిదండ్రులకు పిల్లల్ని దూరం చేస్తుంది. పిల్లల కోసం తల్లిదండ్రులు హంతకులుగా మారేలా కూడా చేస్తుంది. తనను ప్రేమించడంలేదని ప్రాణాలు తీసేవారినీ చూశాం. అయితే, ఇది మాత్రం అలాంటి ఘటన కాదు. ప్రియురాలు లేని లోకంలో ఉండటం ఎందుకు అనే భావనతో ఓ యువకుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. నీవులేని జీవితం నాకు వద్దు అని ఆమె సమాధి వద్దే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహదేవపూర్ కి చెందిన చల్లా మహేశ్ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నాడు. అతడు కుదురుపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే, ఆమె కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటినుంచి తీవ్ర మనస్తాపానికి లోనైన మహేశ్.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ప్రియురాలు లేని లోకంలో ఉండలేనని పేర్కొంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అనంతరం ప్రియురాలి సమాధి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్ వాట్సాప్ స్టేటస్ చూసిన స్నేహితులు వెంటనే అతడి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. అయితే, అప్పటికే మహేశ్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
3170 989644We stumbled more than here coming from a different internet page and thought I may well check points out. I like what I see so now im following you. Look forward to exploring your internet page however once again. 258869
238827 996557excellent day, your site is really unquie. Anways, i do appreciate your work 238498