కరోనా మహమ్మారి మనదేశంలోనూ నెమ్మదిగా కోరాలు చాస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్.. ప్రపంచదేశాలను వేగంగా వ్యాపించింది. ప్రస్తుతం భారత్ లో 149 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా బుధవారం తెలంగాణలో ఆరో పాజిటివ్ కేసు వెలుగు చూసింది. యూకే నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ ఉన్నట్టు నిర్దారణ అయింది. కరోనా వ్యాపించకుండా ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఒక్కో కేసు వెలుగు చూస్తోంది.
తొలుత విదేశీ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసే విషయంలో అనుసరించిన అలసత్వమే నేటి ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న విషయం గమనించిన వెంటనే విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అప్పుడు కేవలం కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రమే స్క్రీనింగ్ చేశారు.
దుబాయ్ తదితర దేశాల్లో కరోనా లేదనే కారణంతో అక్కడి నుంచి వచ్చిన ప్రయాణికులను పట్టించుకోలేదు. అదే ఇప్పుడు శాపమైంది. పలువురు ప్రయాణికులు కరోనా ఉన్న దేశాల్లో తిరిగిన తర్వాత దుబాయ్ మీదుగా భారత్ వచ్చారు. అలాంటివారికి పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆ వైరస్ మన దేశంలోని ప్రవేశించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నా.. పలువురు దాని నుంచి తప్పించుకునేందుకు విమానంలోనే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. ఫలితంగా థర్మల్ స్క్రీనింగ్ లో దొరకడంలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మంది కరోనా బాధితులు ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 7,900 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి.
376946 174570You designed some decent points there. I looked over the internet for any difficulty and located most individuals goes as well as together with your web site. 240980
860124 163609An fascinating discussion might be valued at comment. I do believe that you simply write read far more about this subject, it may possibly not often be a taboo subject but normally persons are too few to dicuss on such topics. To a higher. Cheers 979391
282681 240102This website is usually a walk-through you discover the details it suited you about this and didnt know who want to. Glimpse here, and you will undoubtedly discover it. 795364