దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా కరోనా మరణాల సంఖ్య దాస్తున్నారు అంటూ ఐఐఎం ప్రొఫెసర్ చిన్మయి తుంబే అన్నారు. గత ఏడాది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరియు మరణాలతో పోల్చితే ఈ ఏడాది పాజిటివ్ సంఖ్య మరణాల సగటు అత్యంత తక్కువగా ఉంది. ఖచ్చితంగా ఇది మరణాల సంఖ్యను తగ్గించి చూపించడమే అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో ఏకంగా 5 లక్షల మంది కరోనాతో మృతి చెంది ఉంటారని.. కాని ప్రభుత్వాలు చూపిస్తున్న సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని అన్నారు.
కేవలం ఈ ఏడాదిలోనే దేశంలో దాదాపుగా రెండు మిలియన్ల మంది అంటే 20 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని ఆయన అంచనా వేస్తున్నాడు. ఆయన అంచనా ప్రకారం దేశంలో కరోనా మృతుల సంఖ్యను అన్ని రాష్ట్రాలు కూడా చాలా చాలా తక్కువ చేసి చూపిస్తున్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదని.. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కాస్త అధ్యయనం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు కరోనా కేసులను కూడా తగ్గించి చూపిందని ఆయన అన్నారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం ప్రపంచ దేశాల్లోకి ఇండియా అత్యధికంగా ఎఫెక్ట్ అయ్యింది.
440415 323272Directories such given that the Yellow Websites want not list them, so unlisted numbers strength sometimes be alive more harm than financial assistance. 986866