Marriage: ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమం గొప్ప కార్యక్రమం అంటూ వార్తల్లో నిలిచింది. అంతలోనే ఆ సామూహిక వివాహ కార్యక్రమంలో కొత్త దంపతులకు ఇచ్చిన కిట్ లో కండోమ్ ప్యాకెట్స్ మరియు గర్భ నిరోదక మాత్రలు ఉండటం తీవ్ర స్థాయిలో విమర్శలకు తెర తీసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… మధ్య ప్రదేశ్ లోని జాభువా జిల్లాలో ముఖ్యమంత్రి కన్యా వివాహ్ కార్యక్రమంలో భాగంగా 283 జంటలకు సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. వివాహం అనంతరం స్థానిక నాయకులు కొత్త జంటలకు పెళ్లి కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
ప్రభుత్వం ఇచ్చిన కిట్ లో కండోమ్.. గర్భ నిరోదక మాత్రలు ఉండటంను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. కుటుంబ నియంత్రణలో భాగంగా కిట్ లో కండోమ్స్ మరియు గర్భనిరోదక మాత్రలను ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ వర్గాల వారు చెబుతున్నారు. ఎంతైనా ఇలా చేయడం సిగ్గు చేటు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.