భారత్ – చైనా మధ్య లడఖ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలసిందే. రెండు దేశాల మిలిటరీ కూడా అక్కడ భారీగా సైనికులను, యుధ్ద ట్యాంకులు, విమానాలు మొహరించాయి. చైనా అక్కడ ఎయిర్ బేస్ ను కూడా విస్తరిస్తోందని వార్తలు వచ్చాయి. రెండు దేశాల సైనికుల మధ్య కూడా వాదనలు జరిగాయని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రేపు రెండు దేశాల మిలిటరీ అధికారుల మధ్య సమావేశం జరగాల్సి ఉంది. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి రేకెత్తింది. అయితే.. ఈ భేటీకి ఒక రోజు ముందుగానే చైనా సానుకూలమైన ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. లడఖ్ ఉద్రిక్తతలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ చైనా ప్రకటించింది. లడఖ్ లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని.. భారత్ కి తాము ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సయోధ్య కోసం మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకు రెండు దేశాలు అంగీకరించలేదు. చైనా అక్కడ భారీగా దళాలను మొహరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో భారత్ కూడా బలగలను మొహరించింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళనల మధ్య చైనా చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.
989199 257850Thanks for providing such an excellent article, it was outstanding and quite informative. Its my 1st time that I check out here. I located a great deal of informative stuff within your write-up. Maintain it up. Thank you. 920177
834028 636146Cool text dude, maintain up the very good work, just shared this with the mates 74279
661188 160899Now im encountering a fresh short issues Once i cant appear like allowed to sign up for the particular give food to, Now im utilizing search engines like google audience. 223349
90479 142378Conveyancing […]we like to honor other internet sites on the internet, even if they arent related to us, by linking to them. Below are some internet sites worth checking out[…] 698835