దేశంలో అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉదయం లేచి పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా ఒకటే కనిపిస్తోంది. అదేమంటే… క్రైమ్.. క్రైమ్.. క్రైమ్… అక్కడ అత్యాచారం జరిగింది.. ఇక్కడ హత్య జరిగింది అనే మాటలు వినిపిస్తుంటాయి. ఈ అత్యాచారాలు, హత్యలతో దేశం అట్టుడికిపోతోంది.
దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మాగాంధీని అతి దారుణంగా అందరు చూస్తుండగానే గాడ్సే హత్య చేశారు. గాంధీ మహాత్ముడు పుట్టిన ఈ దేశంలో గాడ్సే కూడా పుట్టాడు.. ఒక నాణానికి రెండు ముఖాలు ఉన్నట్టుగానే.. సమాజంలో మంచి చెడు రెండు ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో మంచి కంటే కూడా చెడే ఎక్కువగా జరుగుతున్నది.
అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలనే ఇప్పటికి అనుసరిస్తున్నారు. ఈ చట్టాల్లో అప్పుడపుడు మార్పులు చేస్తున్నా ఆ మార్పులు కఠినంగా ఉండటం లేదు. ఒకవేళ చట్టాలు కఠినంగా ఉండేలా చేసి వాటిని అనుసరించాలి అనే సరికి.. బాబోయ్ అని బెంబేలెత్తిపోతుంటారు. దానికి ఓ ఉదాహరణ మోటార్ యాక్ట్ చట్టం.
మోటార్ యాక్ట్ చట్టంలో మార్పులు చేసి, ప్రమాదాలు నివారించేందుకు ప్రయత్నాలు చేస్తే… దానిని ప్రజల కంటే చాలా రాష్ట్రాల రాజకీయ నాయకులు, అక్కడి ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ప్రభుత్వాలే కఠినమైన నియమాలను అమలు చేయడానికి వెనకడుగు వేస్తుంటే.. ప్రజలు అలా అనుసరిస్తారు.
దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు మారనంతకాలం దేశంలో చట్టాలు గాంధారి పాత్రను పోషించడం తప్ప ఎందుకు ఉపయోగం ఉండదు. కొన్ని ప్రత్యేక నేరాలకు కోర్టులు ఉరిశిక్షలు వేస్తున్నారు. అలా కోర్టులు వేసిన ఉరిశిక్షలు అమలు జరుగుతున్నాయా.. అంటే లేదనే చెప్పాలి. దేశంలో ఇంకా దాదాపుగా 50 పైగా ఉరిశిక్ష పడ్డ ఖైదీలు క్యూలో ఉన్నారు.
ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. పై నుంచి వారిని ఉరి తీసేందుకు ఇప్పటి వరకు అనుమతి రాలేదు. వరంగల్ లో మైనర్ బాలికపై రేప్ జరిగిన సమయంలో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. కానీ, ఆ శిక్ష అమలు కాలేదు. ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఇప్పుడు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య విషయంలో కూడా ఇదే విధంగా జరిగే అవకాశం ఉన్నది. అందుకే ప్రజలు ఆ నిందితులను వెంటనే చంపేయాలని ఆవేశంతో నినాదాలు చేస్తున్నారు.
345043 858331extremely nice post, i undoubtedly adore this incredible web site, carry on it 164587