55 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన తరువాత ఎట్టకేలకు శనివారం నుంచి కార్మికులు తిరిగి విధుల్లో జాయిన్ అయ్యారు. విధుల్లో జాయిన్ కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే.. కార్మికులు కెసిఆర్ కు పాలాభిషేకాలు చేశారు. కెసిఆర్ ను దేవుడిలా కొలిచారు. కారణం ఏంటి అంటే.. సమ్మె చేస్తున్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తున్నట్టు చెప్పిన కెసిఆర్ పై అప్పట్లో కార్మికులు చాలా కోపంగా ఉన్నారు. కెసిఆర్ కూడా అంతే కోపాన్ని ప్రదర్శించారు. కోర్టులో కేసులు నడిచాయి. అనుకున్నట్టుగా కార్మికుల డిమాండ్లు నెరవేరకపోగా.. అసలు ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో తెలియకుండా మారిపోయింది.
విధుల్లోకి చేరిన కార్మికులు ప్రగతి రథ చక్రాలను పరుగులు తీయిస్తున్నారు. ఇక ఈరోజు కెసిఆర్ రాష్ట్రంలోని 97 డిపోలకు చెందిన సీనియర్ కార్మికులకు ఈరోజు ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి 700 మంది హాజరయ్యారు. అక్కడే వారితో కలిసి భోజనం చేశారు. భోజనం చేసే సమయంలో కెసిఆర్ వారితో ఆర్టీసీ భవిష్యత్తు గురించి మాట్లాడారు. సెప్టెంబర్ మాసం జీతం, సమ్మె చేసిన సమయంలో జీతంతో పాటుగా ఆర్టీసీకి వచ్చే సంవత్సరం నుంచి వార్షిక బడ్జెట్ లో రూ. 1000 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారు.
వెయ్యి కోట్లు కేటాయించడం అంటే మాములు విషయం కాదు. బడ్జెట్ లో పెట్టె వెయ్యికోట్లు వెస్ట్ చేయకుండా ఆర్టీసీ భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తే.. ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడి ఈజీగా లాభాల బాట పడుతుంది. ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఇచ్చినట్టుగానే బోనస్ ఇస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికైతే.. మొన్నటి వరకు గిల్లి గిల్లి కార్మికులను ఏడిపించిన కెసిఆర్, ఇప్పుడు వెన్న పూసి చల్లబరిచారు.
543308 627716How do I know if a Wordpress theme supports a subscribe option? 593499
507983 667527educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 77994
43908 252872Id forever want to be update on new posts on this site , bookmarked ! . 889869
24197 232763so considerably excellent details on here, : D. 807599