ఏపీ జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. అయితే సవరించిన అంచనాల నేపథ్యంలో కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని ఏపీ ఎప్పటినుంచో అడుగుతోంది. పాత అంచనా వ్యయమే భరిస్తామని ఇప్పటివరకూ చెప్పిన కేంద్రం మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్ సమాధానం ఇచ్చారు.
హెడ్ వర్క్స్, డిజైన్లు మార్పుతో పోలవరం ఖర్చు రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని ఏపీ తెలిపింది. గోదావరి ట్రైబ్యునల్ నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలని.. వాటిని సీడబ్ల్యూసీ ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని మంత్రి తెలిపారు. కాఫర్ డ్యామ్, పునాది పనులు, స్పిల్వే, డయాఫ్రం వాల్ పనులు, చిప్పింగ్, స్పిల్వే కాంక్రీట్ పనులు అదనంగా చేపట్టామని ఏపీ చెప్పినట్లు కేంద్రం తెలిపింది.
అయితే.. 2014 ఏప్రిల్ నాటి అంచనా వ్యయమే భరిస్తామని.. పెరిగిన వ్యయాన్ని ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈమేరకు కేంద్ర మంత్రి షెకావత్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
40646 781246Basically a smiling visitor here to share the enjoy (:, btw fantastic pattern . 498717