ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ అభ్యర్థులగా పోటీ లో నిలపటం ద్వారా గెలుపుకి కృషి చేస్తాయి. డబ్బు, కులబలం, హంగు, పలుకుబడి అన్నిటిని లెక్కలోకి తీసుకోవటం పరిపాటి.
విద్యా పరంగా, ఆర్ధికపరంగా ఉపాధి పరంగా మెరుగు అయినా పరిస్థితులు వున్న కోస్తాంధ్ర అంతటా ఎక్కువ సామాజిక వర్గాలనుంచి రాజకీయ పరమైన ఆకాంక్షలు, రాజాకీయ చైతన్యం ఉండటంతో నిజమైన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. అదే రాయల సీమ, తెలంగాణ గ్రామీణ పంథాలో రైతు వారి కులం అయిన రెడ్డి కులస్థులు అనాదిగా గ్రామీణ రాజకీయ కులంగా ఉండటం వేరే ఇతర వర్గాలనుంచి రాజకీయ పరమైన నామమాత్రం పోటీ కూడా లేక పోవటం కడు శోచనీయం.
ఆంధ్ర రాష్ట్ర రాజకీయ యవునికలో ప్రధానం గా మూడు సామాజిక వర్గాల వారి నుంచి ఎక్కువ మంది మ్మెల్యే రావాటానికి మూడు ప్రధాన కారణాలు
రెడ్లు రాజకీయంగా గ్రామీణ క్షేత్ర స్థాయి నుంచి అత్యంత చైతన్యం వున్న కులంగా, కొన్ని జిల్లాల్లో నామమాత్రం పోటీ కూడా ఇతర సామాజిక వర్గాల నుంచి లేక పోవటం వలన గత 11 పర్యాయాలుగా ప్రధాన పార్టీలు అన్నీ కూడా చాలా నియోజక వర్గాల్లో వారినే తమ అభ్యర్థులగా ప్రకటిస్తున్నాయి
కమ్మ వారు విద్య, వైద్యం, వ్యాపార, మీడియా, సినిమా రంగాల్లో ప్రజలని ప్రభావితం చెయ్య గలిగే రంగాల్లో అగ్రగామి గా వుంటూ, సుస్సంపన్నమైన కులంగా ప్రదాన పారీల్లో అగ్ర నాయకత్వంలో ఉండటం ద్వారా ఎక్కువ అవకాశాలు అంది పుచ్చూకుంటూ విజయాలు సాధిస్తున్నారు
విద్య, వ్యాపార, రాజకీయంగా మరే ఇతర వెనుకపడిన వర్గాల కంటే కూడా ముందు వరుసలో లేనప్పటికీ కాపులకి విస్తృత స్థాయిలో శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు జన సాంద్రత వున్న నియోజక వర్గాలు, సంఖ్య పరం గా ప్రధమ స్థానంలో కోకొల్లలు గా ఉండటం అప్రయత్నం గానే ప్రధాన రాజకీయ పార్టీలకి టికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితులు వున్నాయి.. మరి ఏ ఇతర వెనుకపడిన కులంకి (బీసీ కులాలు అన్ని కలిపి కాదు అని గమనించవలిసింది గా మనవి) కూడా నియోజక వర్గస్థాయిలో కాపులు ప్రధమ స్థానంలో వున్న అన్ని నియోజక వర్గాలు లేవు
చాలా సందర్భాల్లో కొన్ని నియోజక వర్గాల్లో రెండు రాజకీయ శిబిరాలు ఒకే సామాజిక వర్గంకి ఇవ్వటం అనేది పరిపాటి
2024 సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గంకి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 47 స్థానాలు, కూటమి 27 స్థానాలు అవకాశం కల్పించాయి, 22 స్థానాల్లో రెండు పక్షాల నుంచి పోటీలో ఉండటం తో కనిష్టం గా 22 ఏమ్మెల్యే ల నుంచి అత్యధికంగా 52 స్థానాల్లో ఎమ్మెల్యేలు గా గెలవటానికి అవకాశం వుంది.
కమ్మ సామాజిక వర్గంకి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, కూటమి 36 స్థానాలు అవకాశం కల్పించాయి, 8 స్థానాల్లో రెండు పక్షాల నుంచి పోటీలో ఉండటంతో కనిష్టంగా 8 ఏమ్మెల్యే ల నుంచి అత్యధికంగా ౩7 స్థానాల్లో ఎమ్మెల్యేలు గా గెలవటానికి అవకాశం వుంది.
కాపు సామాజిక వర్గంకి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాలు, కూటమి 24 స్థానాలు అవకాశం కల్పించాయి, 16 స్థానాల్లో రెండు పక్షాల నుంచి పోటీలో ఉండటంతో కనిష్టంగా 16 ఏమ్మెల్యే ల నుంచి అత్యధికంగా 38 స్థానాల్లో ఎమ్మెల్యేలు గా గెలవటానికి అవకాశం వుంది.
రెడ్లు మాత్రమే ఎమ్మెల్యేలు గా వచ్ఛే స్థానాలు 22
మాచెర్ల
గిద్దలూరు
కావలి
ఆత్మకూరు
కోవూరు
నెల్లూరు రురల్
సర్వేపల్లి
రాయచోటి
పులివెందుల
కమలాపురం
జమ్మలమడుగు
ప్రొద్దటూరు
ఆళ్లగడ్డ
శ్రీశైలం
పాణ్యం
బనగానపల్లె
ధోన్
తాడిపత్రి
పుట్టపర్తి
పీలేరు
పుంగనూరు
శ్రీకాళహస్తి
కాపులు మాత్రమే ఎమ్మెల్యేలు గా వచ్ఛే స్థానాలు 16
పాతపట్నం
చీపురుపల్లి
గజపతినగరం
భీమిలి
పత్తిపాడు
పిఠాపురం
కాకినాడ రురల్
పెద్దాపురం
రాజానగరం
జగ్గంపేట
నిడదవోలు
భీమవరం
తాడేపల్లిగూడెం
ఏలూరు
అవనిగడ్డ
సత్తెనపల్లె
కమ్మ వారు మాత్రమే ఎమ్మెల్యేలుగా వచ్ఛే స్థానాలు 16
విశాఖపట్నం ఈస్ట్
దెందులూరు
గన్నవరం
గుడివాడ
విజయవాడ ఈస్ట్
పెదకూరపాడు
తెనాలి
వినుకొండ