తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జనంలోకి వెళ్ళారు. కృష్ణా నది వరదల నేపథ్యంలో నిండా మునిగిపోయిన బాధితుల్ని చంద్రబాబు పరామర్శించారు. వారి సాదక బాధకాల్ని తెలుసుకున్నారు. తన ఇంటిని ముంచేసే ప్రయత్నంలో అభాగ్యుల ఇళ్ళను వైఎస్ జగన్ ప్రభుత్వం ముంచేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు చంద్రబాబు. ‘మంత్రులకు నా ఇంటి దగ్గర ఏం పని.? అయినా అది అద్దె ఇల్లు. మునిగితే, ఆ ఇంటి ఓనర్కి నష్టం. మీకెందుకు అంత అత్యుత్సాహం.?’ అంటూ మంత్రుల్ని చంద్రబాబు, ప్రజల సాక్షిగా నిలదీశారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియనివారు అధికారంలో వుండబట్టే కృష్ణా నది ఈస్థాయిలో జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.
ఇదంతా నాణానికి ఓ వైపు. మరో వైపు, మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబుని విమర్శించే క్రమంలో అధికార పార్టీని నిండా ముంచేశారు. ముందూ వెనుకా చూడకుండా అమరావతి ప్రస్తావనను తీసుకొచ్చి, కృష్ణా నది వరదలతో అమరావతికి భద్రత లేదని తేలిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని సెలవిచ్చారు బొత్స. అంతే, బొత్స వ్యాఖ్యలతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు.
వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన పార్ధసారధి, బొత్స వ్యాఖ్యల్ని మీడియా వక్రీరిస్తోందనీ, తెలుగుదేశం పార్టీ అడ్డగోలు వాదనల్ని తెరపైకి తెచ్చిందనీ, ఆయన చెప్పింది కొత్త విషయం కాదనీ, గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాల్నే బొత్స ప్రస్తావించారనీ, తనకు తెలిసినంతవరకూ అమరావతిని మార్చే ప్రసక్తే వుండదనీ తేల్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేయడం బొత్సకు ఇదే తొలిసారి కాదు. మంత్రి అయ్యా పలుమార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోపక్క, బొత్స వ్యాఖ్యలు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి వరంగా మారాయి. వైసీపీని ఏకిపారేస్తున్నారు అమరావతి విషయమై టీడీపీ నేతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలోకి దిగి అమరావతిపై స్పష్టత ఇస్తే తప్ప ఈ వివాదం చల్లారేలా లేదు.
684550 298428Id always want to be update on new weblog posts on this web website , bookmarked ! . 296236