తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆరేళ్లలో ప్రజలకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఆన్ లైన్ ద్వారా జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిలో ముందున్న కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి సాధించింది మాత్రం శూన్యమని అన్నారు. రూ.45వేల కోట్లకు పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజక్టులో 85వేల కోట్లకు పెంచి కేసీఆర్ పెద్ద అవినీతికి పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ నిరుద్యోగుల కోసం ఆ హామీ ఏమేరకు నెరవేర్చారో చెప్పాలన్నారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడిపై హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు. కేసీఆర్ కుంభకర్ణుడి నిద్ర పోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా టెస్టులు చేయడంలో తెలంగాణ విఫలమైందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పాలని నడ్డా పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారని అన్నారు.
దేశంలో కోవిడ్ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా నడ్డా అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుని అభివృద్ది వైపు అడుగులేస్తోందని ప్రజలు సహకరించాలని కోరారు. కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచనగా నడ్డా చెప్పారు.
859608 163887Outstanding editorial! Would like took pleasure the particular following. Im hoping to learn to read a lot much more of you. Theres no doubt which you possess tremendous awareness and even imagination. I happen to be really highly fascinated using this critical info. 824608
624479 844664I enjoy what you guys are normally up too. This kind of clever work and reporting! Maintain up the extremely good works guys Ive added you guys to blogroll. 817355
484648 275064Could it be okay to write several of this on my small web site only incorporate a one way link towards the web site? 991297