ముంబయిలోని నవీ ముంబయి పోర్ట్ లో దాదాపుగా 191 కిలోల డ్రగ్స్ను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం చూస్తే వెయ్యి కోట్లుగా చెబుతున్నారు. దేశంలో ఇంత పెద్ద డ్రగ్స్ నిల్వలు బయట పడటం చాలా అరుదుగా చెబుతున్నారు. ముంబయిలో ఇదే ప్రథమం అంటున్నారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ మొత్తం కూడా అప్ఘనిస్థాన్ నుండి తీసుకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
దేశంలోని పలు ప్రాంతాలకు ఈ డ్రగ్స్ను సరఫరా చేయబోతున్నారు. ఈ డ్రగ్స్ను ప్లాస్టిక్ లోపల అమర్చి గుర్తించకుడా జాగ్రత్త పడి ఇరాన్ మీదుగా ఇక్కడకు తీసుకు వచ్చారట. కస్టమ్స్ డిపార్ట్ మెంట్ మరియు డీఆర్ఐ టీమ్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ను పట్టుకున్నట్లుగా ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా అప్ఘనిస్తాన్ నుండి కోట్లాది రూపాయల మాధక ద్రవ్యాలు వస్తున్నాయి. వాటిని అడ్డుకోవడంలో కస్టమ్స్ అధికారులు తీవ్రంగా కష్టపడుతున్నా కూడా ఏదో మార్గంలో కేటుగాళ్లు తీసుకు వస్తూనే ఉన్నారు. ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటామని పేర్కొన్నారు.
171982 57465I got what you intend, saved to my bookmarks , very decent web site . 183326
524323 260583I genuinely enjoy seeking at on this internet site , it has amazing content . 901069
87410 539014The write-up posted was very informative and beneficial. You folks are doing a terrific job. Keep going. 496569