రీచార్జిలు, వివిధ రకాల బిల్లుల ఆటోమేటిక్ చెల్లింపులు ఇకపై కుదరవు. ఇలాంటి బిల్లుల చెల్లింపునకు సంబంధించి అదనపు ధ్రువీకరణ తప్పనిసరి అని రిజర్వుబ్యాంకు స్పష్టంచేయడంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆటోమేటిక్ చెల్లింపులు నిలిచిపోనున్నాయి. అదనపు ధ్రువీకరణ లేకుండా కార్డులు, ప్రీపెయిడ్ పేమెంట్ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తున్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్బీఐ గతేడాది 4న ఆదేశించింది. కార్డు లావాదేవీల భద్రత, రక్షణ బలోపేతం చేయడం కోసం ఆర్బీఐ ఈ చర్య చేపట్టింది. అయితే, ఈ మార్గదర్శకాలను అమలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని బ్యాంకులు, పేమెంట్ గేట్ వే సంస్థలు కోరుతున్నాయి.
కానీ ఆర్బీఐ మాత్రం మార్చి 31 తర్వాత అదనపు ధ్రువీకరణ లేకుండా చెల్లింపులు చేయడం కుదరదని స్పష్టంచేస్తోంది. కొన్ని బ్యాంకులు మాత్రం దీనికి సంబంధించిన సమాచారాన్ని తమ వినియోగదారులకు చేరవేశాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్స్ ప్రకారం నిర్దేశిత బిల్లర్లకు చేయాల్సిన ఆటోమేటిక్ చెల్లింపులు ఏప్రిల్ ఒకటి నుంచి పనిచేయవని.. అందువల్ల ఆయా బిల్లులను నేరుగా చెల్లించుకోవాలని అందులో పేర్కొంటున్నాయి.
866917 345531Id forever want to be update on new posts on this web site , bookmarked ! . 586410
544863 799583What platform and theme are you using if I may possibly ask? Where can I buy them? x 240302