అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక ద్విభాషా చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు షూటింగ్ కు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మేల్కోటి అనే గ్రామంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చేస్తుండగా గ్రామస్థులు ఆగ్రహంతో షూటింగ్ ను అడ్డుకున్నారట. దానికి కారణం షూటింగ్ జరుగుతున్న ప్రాంతం పక్కనే రాయగోపుర దేవాలయం ఉంది.
నిత్యం పూజలు జరిగే చోట పక్కనే బార్ సెట్ వేసి సీన్స్ షూట్ చేస్తుండడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాకుండా చిత్ర యూనిట్ మీద దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నాగ చైతన్య షూటింగ్ స్పాట్ లోనే ఉన్నారట. దీని గురించి స్పందిస్తూ పోలీస్ పెర్మిషన్ తీసుకున్నా కానీ ఈ రకమైన సీన్లు షూట్ చేస్తారని చెప్పలేదని మాండ్య డీసీ పేర్కొన్నారు.
690023 660018You should participate in a contest for among the most effective blogs on the internet. I will recommend this site! 185007