ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి గాయం అయింది.
క్యాట్ బాల్ తో రాయి విసిరినట్లు తెలుస్తోంది. వెంటనే డాక్టర్లు బస్సులోనే ఆయనకు ప్రతిమ చికిత్స అందించారు. అనంతరం జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటనలో సీఎం పక్కనే ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి కూడా స్వల్ప గాయమైంది.
విజయవాడలో ప్రస్తుతం బస్సు యాత్ర జరుగుతోంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేదు. ఘటన స్థలానికి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలని పోలీసులు పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో బస్సు యాత్రకి బ్రేక్ ఇవ్వాలని వైసిపి శ్రేణులు యోచిస్తున్నట్లు సమాచారం.
Unknown individuals pelted stones at YS Jagan during his bus tour in Vijayawada today.
He was injured near eyebrow, received first aid and continued his tour. #YSJagan #APElections2024 #YSRCP pic.twitter.com/f18naFHdr6
— TeluguBulletin.com (@TeluguBulletin) April 13, 2024