తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం, దానికి ఆయా పార్టీలకి అనుకూలం గా వుండే మేధావులు మీడియా లో విపరీతమైన ప్రచారం చెయ్యటం అనేది సర్వసాధారణం.
నిజంగా ఏ పార్టీ అయినా వారికి పెద్ద పీట వేస్తుందా అని చూసినప్పుడు గతించిన ఎన్నికల తో పోలిస్తే వెనుకపడిన తరగతుల శాసన సభ్యుల సంఖ్యలో పెద్ద మార్పులు ఏమి వుండవు. టీడీపీ లో కొద్దీ మంది బీసీ నాయకులకి వ్యక్తులుగా ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది కానీ స్థూలం ఏ పార్టీ లో కూడా వారికి ఇచ్ఛేసంఖ్య లో పెద్ద తేడాలు ఏవి ఉండవు.
తెలంగాణ ప్రాంతంలో అందరు చెప్పే మాట వెనుకపడిన తరగతులు ఎక్కువ అని, కానీ ఈ రోజున అసెంబ్లీ లో వారి MLA ల సంఖ్య అక్షరాలా 19.
ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ పార్టీ 41 మంది వెనుకపడిన తరగతులకి, టీడీపీ కూటమి 40 మంది వెనుకపడిన తరగతులకి అవకాశం కల్పించాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 పల్స్ సర్వే అధికారపు లెక్కల పరంగా 1,92,91,829 బీసీ కులస్థుల ఓటర్లు వున్నారు. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య లో 45% గా వున్నారు
అందులో ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతు కులాలు గవర, కాళింగ, వెలమ, కాపు కులాలు సాంకేతికంగా వెనుకపడిన తరగతులుగా ఉన్నప్పటికీ నిజానికి వారు భూమిపుత్రులు, ఆర్ధికం గా, సామాజికంగా, విద్య, ఉద్యోగ,వ్యాపారాలలో మిగిలిన రైతుకులాల లానే రాజకీయాల్లో అవకాశాలని అందిపుచ్ఛుకుంటున్నారు.
అయినప్పటికీ వారిని కూడా పరిగణలో తీసుకున్న వెనుకుబడిన తరగతులకి ఎందుకని ఎక్కువ అవకాశాలని కల్పించలేకున్నారు అనేది సూక్ష్మంగా పరిశీలించవలిసిన విషయం, పైకి ఇంత సంఖ్య కనిపిస్తున్నప్పటికీ ఎవరు పనిగట్టుకుని ఫలానా వారికి అవకాశాలు ఇవ్వకూడదు, తొక్కేయ్యాలి అని చూడరు.
ఎవరి జీవితంలో అయినా మీరు ఏకులం అని అడిగితే నేను ఓసీ,, లేదా బీసీ , లేదా ఎస్సీ, లేదా ఎస్టీ అని చెప్పిన సందర్భం దాదాపు ఉండదు, పరిపాలనా సౌలభ్యం, సంక్షేమ పధకాలు అమలు చేయటానికి సమాజం లో కులాలని తరగుతులు గా విభజించటం, వారికి ఆయా పథకాల్ని అమలు చెయ్యటం అనేది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చేసినది
అంతే కానీ ఆ తరగతిలో వున్నా అంత మాత్రాన ఆ కులాలు అన్ని కూడా ఐక్యం గా వుంటారు అని అనుకోవటం నిజం కాదు. ఉదాహరణ కి నియోజక వర్గంలో ఒక గౌడ కులస్థుడు మరొక రెడ్డి కులస్థుడు పోటీ చేస్తున్న సందర్భంలో మిగిలిన వెనుకపడిన తరగతులు గంపగుత్తగా కులం పరంగా ఇద్దరినీ ఓన్ చేసుకునే అవకాశం లేదు. ఆ నియోజక వర్గంలో వున్న కుమ్మరి,కమ్మరి, జాలరి,శాలి, వడ్డెర, ఉప్పర, రజక, క్షురక ఇలా ఏ కులం కి ఆకులం గానే ఉంటాయి గాని బీసీ తరగులు కాబట్టి బీసీ లు అందరు వేస్తే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా ఓసీ అభ్యర్థులు ఎట్టి పరిస్థుల్లో గెలవరు, కానీ వాస్తవ రూపంలో అలా ఉండదు.
దానిని దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఆ నియోజకవర్గంలో పార్టీకి చేసిన సేవ, జనం దృష్టిలో ఆ అభ్యర్థికి వున్న పలుకుబడి, ఆర్థికపరమైన పరిపుష్టి, సామాజిక వర్గం కి వున్న ఓట్ల సంఖ్య, ప్రత్యర్థి కి వుండే బల బలాలు అని బేరీజు వేసుకుని మాత్రం గెలుపే లక్ష్యంగా పార్టీలు టికెట్స్ ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో బీసీ తరగతుల్లో ఓట్ల సంఖ్యాపరంగా మొదట 10 స్థానాల్లో వున్న కులాలు
1) యాదవ – 25,53,444
2) గౌడ/చెట్టు బలిజ – 19,78,826
3) మత్సకార – 15,74,865
4) ఉత్తరాంధ్ర కాపులు – 15,18,044
5) రజక – 11,63,887
6) బోయ/వాల్మీకులు – 9,69,868
7) ఉత్తరాంధ్ర వెలమలు – 9,36,564
8) వడ్డెర – 8,61,391
9) చేనేత – 6,87,294
10) కురుబ – 5,34,262
బీసీ తరగతుల్లో వుండి, రాష్ట్రం అంత విస్తరించి వున్న రజక, వడ్డెర లాంటి వారు ఎప్పటికి MLA లు కాలేకున్నారు. అదే విధంగా మత్సకారుల తీర ప్రాంతం అంతా , యాదవులు గాని, గౌడ సామాజిక వర్గం గాని రాష్ట్రం అంతటా విస్తరించి ఉండటంలో సాంద్రత తగ్గి ఏ నియోజక వర్గంలో కూడా ఇవ్వక తప్పని పరిస్థులు లేవు. బోయ, కురుబ లాంటి కులాలు పరిమిత నియోజక వర్గాల్లో మాత్రమే కేంద్రీకృతం అవ్వటం వలన వారికి అవకాశాలు పరిమిత సంఖ్యలో వస్తున్నాయి వేరే ఇతర అంశాలు అయినా ఆర్ధిక వెన్నుదన్ను, నేలమీద ఆధిపత్యం, వృత్త్తిపరమైన ఖ్యాతి లాంటివి దృష్టిలో ఉంచుకుని.
రాజ్యాంగపరంగా వెనుకపడిన తరగతులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం అని కోట ఏర్పాటు చేస్తే తప్ప తెలంగాణ, ఆంధ్ర ల్లో మొత్తం గా చూస్తే బీసీ కులాలకి అసెంబ్లీలో సంఖ్య పెరగటం అనేది దాదాపు అసాధ్యం.
బీసీ ఓ బ్రహ్మ పదార్ధం!
తెలుగు రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారం. వెనుకబడిన తరగతులకి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం, దానికి ఆయా పార్టీలకి అనుకూలం గా వుండే మేథావులు మీడియాలో విపరీతమైన ప్రచారం చెయ్యటం అనేది సర్వసాధారణం.
నిజంగా ఏ పార్టీ అయినా వారికి పెద్ద పీట వేస్తుందా అని చూసినప్పుడు గతించిన ఎన్నికలతో పోలిస్తే వెనుకబ డిన తరగతుల శాసన సభ్యుల సంఖ్యలో పెద్ద మార్పులు ఏమీ వుండవు. టీడీపీలో కొద్దిమంది బీసీ నాయకులకి వ్యక్తులుగా ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది. కానీ స్థూలంగా ఏ పార్టీ లో కూడా వారికి ఇచ్ఛేసంఖ్య లో పెద్ద తేడాలు ఏవి ఉండవు.
తెలంగాణ ప్రాంతంలో అందరూ చెప్పే మాట వెనుకబడిన తరగతులు ఎక్కువ అని, కానీ ఈ రోజున అసెంబ్లీ లో వారి MLA ల సంఖ్య అక్షరాలా 19.
ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ పార్టీ 41 మంది వెనుకబడిన తరగతులకి, టీడీపీ కూటమి 40 మంది వెనుకబడిన తరగతులకి అవకాశం కల్పించాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 పల్స్ సర్వే అధికారపు లెక్కల పరంగా 1,92,91,829 బీసీ కులస్థుల ఓటర్లు వున్నారు. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య లో 45% గా వున్నారు.
అందులో ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతు కులాలు గవర, కాళింగ, వెలమ, కాపు కులాలు సాంకేతికంగా వెనుక బడిన తరగతులుగా ఉన్నప్పటికీ నిజానికి వారు భూమిపుత్రులు. ఆర్ధికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మిగిలిన రైతుకులాల లానే రాజకీయాల్లో అవకాశాలని అందిపుచ్ఛుకుంటున్నారు.
అయినప్పటికీ వారిని కూడా పరిగణలో తీసుకున్నా వెనుకుబడిన తరగతులకి ఎందుకని ఎక్కువ అవకాశాలని కల్పించలేకున్నారు అనేది సూక్ష్మంగా పరిశీలించవలిసిన విషయం, పైకి ఇంత సంఖ్య కనిపిస్తున్నప్పటికీ ఎవరూ పనిగట్టుకుని ఫలానా వారికి అవకాశాలు ఇవ్వకూడదు, తొక్కేయ్యాలి అని చూడరు.
ఎవరి జీవితంలో అయినా మీరు ఏకులం అని అడిగితే నేను ఓసీ, లేదా బీసీ , లేదా ఎస్సీ, లేదా ఎస్టీ అని చెప్పిన సందర్భం దాదాపు ఉండదు, పరిపాలనా సౌలభ్యం, సంక్షేమ పథకాలు అమలు చేయటానికి సమాజం లో కులాలని తరగుతులు గా విభజించటం, వారికి ఆయా పథకాల్ని అమలు చెయ్యటం అనేది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చేసినది.
అంతే కానీ ఆ తరగతిలో వున్నా, అంత మాత్రాన ఆ కులాలు అన్నీ కూడా ఐక్యం గా వుంటారు అని అనుకోవటం నిజం కాదు. ఉదాహరణ కి నియోజక వర్గంలో ఒక గౌడ కులస్థుడు మరొక రెడ్డి కులస్థుడు పోటీ చేస్తున్న సందర్భంలో మిగిలిన వెనుకపడిన తరగతులు గంపగుత్తగా కులం పరంగా ఇద్దరినీ ఓన్ చేసుకునే అవకాశం లేదు. ఆ నియోజక వర్గంలో వున్న కుమ్మరి,కమ్మరి, జాలరి,శాలి, వడ్డెర, ఉప్పర, రజక, క్షురక ఇలా ఏ కులం కి ఆకులం గానే ఉంటాయి గాని బీసీ తరగతులు కాబట్టి బీసీ లు అందరు వేస్తే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా ఓసీ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు. కానీ వాస్తవ రూపంలో అలా ఉండదు.
దానిని దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఆ నియోజకవర్గంలో పార్టీకి చేసిన సేవ, జనం దృష్టిలో ఆ అభ్యర్థికి వున్న పలుకుబడి, ఆర్థికపరమైన పరిపుష్టి, సామాజిక వర్గం కి వున్న ఓట్ల సంఖ్య, ప్రత్యర్థి కి వుండే బల బలాలు అని బేరీజు వేసుకుని మాత్రం గెలుపే లక్ష్యంగా పార్టీలు టికెట్స్ ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో బీసీ తరగతుల్లో ఓట్ల సంఖ్యాపరంగా మొదట 10 స్థానాల్లో వున్న కులాలు
1) యాదవ – 25,53,444
2) గౌడ/ శెట్టి బలిజ – 19,78,826
3) మత్స్యకార – 15,74,865
4) ఉత్తరాంధ్ర కాపులు – 15,18,044
5) రజక – 11,63,887
6) బోయ/వాల్మీకులు – 9,69,868
7) ఉత్తరాంధ్ర వెలమలు – 9,36,564
8) వడ్డెర – 8,61,391
9) చేనేత – 6,87,294
10) కురుబ – 5,34,262
బీసీ తరగతుల్లో వుండి, రాష్ట్రం అంతా విస్తరించి వున్న రజక, వడ్డెర లాంటి వారు ఎప్పటికీ MLA లు కాలేకున్నారు. అదే విధంగా మత్స్యకారుల తీర ప్రాంతం అంతా, యాదవులు గాని, గౌడ సామాజిక వర్గం గాని రాష్ట్రం అంతటా విస్తరించి ఉండటంలో సాంద్రత తగ్గి ఏ నియోజక వర్గంలో కూడా సీటు ఇవ్వక తప్పని పరిస్థితులు లేవు. బోయ, కురుబ లాంటి కులాలు పరిమిత నియోజక వర్గాల్లో మాత్రమే కేంద్రీకృతం అవ్వటం వలన వారికి అవకాశాలు పరిమిత సంఖ్యలో వస్తున్నాయి. వేరే ఇతర అంశాలు అయిన ఆర్ధిక వెన్నుదన్ను, నేలమీద ఆధిపత్యం, వృత్త్తిపరమైన ఖ్యాతి లాంటివి దృష్టిలో ఉంచుకుని.
రాజ్యాంగ పరంగా వెనుకబడిన తరగతులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం అని కోట ఏర్పాటు చేస్తే తప్ప తెలంగాణ, ఆంధ్ర ల్లో మొత్తం గా చూస్తే బీసీ కులాలకి అసెంబ్లీలో సంఖ్య పెరగటం అనేది దాదాపు అసాధ్యం.