కాదేది మోసంకు అనర్హం అనుకున్నాడో ఏమో కాని దిల్లీకి చెందిన ఒక యువకుడు కరోనాను ఉపయోగించుకుని అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. కరోనా సోకిన తాను దాని నుండి బయట పడ్డాను అంటూ ప్రచారం చేస్తు ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారికి ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. తాను ఒక డాక్టర్ ను అని బాధ్యతతో తాను ప్లాస్మాను దానం చేయడం ద్వారా కరోనా రోగులను రక్షిస్తానంటూ జనాలను నమ్మించి మోసం చేస్తున్నాడు.
ఎక్కడ ఎవరికి ప్లాస్మా అవసరం అయినా వచ్చి ఇస్తానంటూ చెప్పి వారి వద్ద ప్రయాణ ఖర్చులు అంటూ వేలకు వేలు లాగి ఆ తర్వాత ఫోన్ను స్విచ్చాన్ చేసి పెడుతున్నాడు. తాజాగా దిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ బంధువులకు కూడా ప్లాస్మా కావాల్సి రావడంతో దాన్ని తాను ఇస్తానంటూ రామ్ మనోహర్ అన్నాడు. అతడి మోసం తెలియక స్పీకర్ రాంనివాస్ గోయల్ ప్రయాణ ఖర్చులు ఇచ్చి రమ్మన్నాడట.
ఆ తర్వాత నుండి రామ్ మనోహర్ ఫోన్ ఆఫ్ చేశాడు. దాంతో అనుమానం వచ్చిన రాంనివాస్ గోయల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. డాక్టర్ను అంటూ మోసం చేశాడని పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇతడు ఎంత మందిని మోసం చేశాడనే విషయాన్ని గుర్తించే పనిలో ఉన్నారు.
750940 58337Its essential to have having access to the knowledge posted here 552861
39535 346120I observe there is a lot of spam on this weblog. Do you want help cleaning them up? I may support in between courses! 477564
710074 865216View the following tips less than and discover to know how to observe this situation whilst you project your home business today. Earn money from home 74018