తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ సుదీర్ఘమైన ఇన్నింగ్స్ కు కేంద్రం ముగింపు పలకబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి నెలకొన్న రాజకీయ అనిశ్చితి, 2014లో ఇరు రాష్ట్రాలుగా విడిపోవడం, ‘ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు-2014’ ప్రకారం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉండాలనే నిబంధన తదితర అనేక అంశాలు నరసింహన్ కు కలిసొచ్చాయి. ఆ కారణంగానే , యూపిఏ ప్రభుత్వ హయాంలో గవర్నర్ గా నియమితులైన నరసింహన్.. ఎన్డీయేలో కూడా కొనసాగారు.
ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలుగురాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు మారాయి. తెలంగాణాలో తెరాస తన అధికారాన్ని నిలబెట్టుకోగా, ఏపీలో తెలుగుదేశం ఓటమి చెంది వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన నేపథ్యంలో.. ఇ ఎస్ ఎల్ నరసింహన్ సేవల్ని కేంద్రం ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
కారణం – రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన సఖ్యత కొనసాగే అవకాశం వుంది. ఇరువురి మధ్య ఇప్పట్లో పెద్దగా విభేదాలు వచ్చే సూచనలు కూడా లేదు. ఇదిలా ఉంటే నరసింహన్ పదవీకాలం దాదాపు పదేళ్లు దాటిపోయింది. ఒక గవర్నర్.. ఒక రాష్ట్రానికి(తదుపరి ఉభయ రాష్ట్రాలకు) రెండు టర్మ్ లు దాటి పదవి లో ఉండటం అసాధారణం.
కాగా, నరసింహన్ ను తొలగించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా శ్రీమతి సుష్మాస్వరాజ్ ను నియమించే అవకాశం వుంది. ఆరోగ్య కారణాల రీత్యా ఈసారి సుష్మాస్వరాజ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఆమెకు సుదీర్ఘ అనుభవం వున్న దృష్ట్యా ఆమె సేవల్ని ఉపయోగించుకోవడంతో పాటు సముచితమైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నర్ గా ఎంపిక చేయనున్నారు.
కాగా సుష్మాస్వరాజ్ కు తెలుగు రాష్ట్రాలతో అనుబంధం వుంది. రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన సందర్భంగా శ్రీమతి సుష్మస్వరాజ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడటమేగాక తనను ‘చినమ్మ’ గా పిలవాలని, గుర్తుపెట్టుకోవాలి కోరారు. అంచేత గవర్నన్ఱ్ గా సుష్మాస్వరాజ్ నియమితులైతే తెలుగు ప్రజలకు సంతోషమే! అంతే కదూ!
Related Posts
ఆర్జీవీ పంచ్.. పవన్ ఫ్యాన్స్ రివర్స్ పంచ్!
ఆ మీడియా సంస్థకు రూ.702 కోట్లిచ్చారా?
840844 810415Cheers for this superb. I was wondering whether you were preparing of publishing similar posts to this. .Keep up the exceptional articles! 502899
282762 472419But wanna remark which you have a really decent internet web site , I adore the style it actually stands out. 788038