Amrit Bharat Express: దేశంలో మరో కొత్త తరహా రైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ తరహాలో ఇవి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లు. డిసెంబర్ 30న అయోధ్యలో ప్రధాని మోదీ (PM Narendra Modi) వీటిని ప్రారంభిస్తారని తెలుస్తోంది. తొలిగా రెండు అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తారని.. మరో ఆరు వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఒక రైలు ఢిల్లీ-దర్భంగా.. మరొకటి బెంగాల్ లోని మాల్దా-బెంగళూరు మార్గాల్లో ప్రయాణించనున్నాయి. దీనిపై ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
వందే భారత్ రైళ్లు.. అయోధ్య-ఆనంద్ విహార్ (ఢిల్లీ), వైష్ణోదేవి-ఢిల్లీ, కోయంబత్తూర్-బెంగళూరు, జాల్నా-ముంబై, అమృత్ సర్-ఢిల్లీ, మంగుళూరు సెంట్రల్-మడ్గావ్ మధ్య అందుబాటులోకి రానున్నాయి. ఇవి నాన్ ఏసీ రైలు పుష్-పుల్ రైళ్లు. ముందూ వెనుకా ఇంజిన్లు. 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, రెండు గార్డ్ బోగీలు (మహిళలు, దివ్యాంగులకు సగం) ఉంటాయి. రైళ్ల గరిష్ఠ వేగం 130 కిమీ. టికెట్ ధరల వివరాలు త్వరలో తెలియజేస్తారు.