ఓ మంత్రిగారేమో రాజధానిని స్మశానం అంటారు.. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ రాజధానిని ‘ఎడారి’గా అభివర్ణిస్తారు. అయినాసరే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి పౌరుషం రాదాయె.. తమ నియోజకవర్గ ప్రజల తరఫున గళం విప్పరాయె. అందుకే, ప్రజలు తమ ఎమ్మెల్యేలు ‘మిస్సింగ్’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఫిర్యాదు చేయడం కూడా తప్పేనట.
‘నేను వ్యక్తిగత పనుల మీద నాలుగు రోజులు నియోజకవర్గంలో లేను.. అంత మాత్రాన మిస్సింగ్ అనేస్తారా.? చంద్రబాబు 34 ఏళ్ళుగా మిస్సింగ్ అని కుప్పం ప్రజలు అంటున్నారు..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గుస్సా అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు. ఆయన అధికార పార్టీ నేత కూడా కాదు. ఇప్పుడు అధికారంలో వున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు, ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.
తమ ఊళ్ళను స్మశానాలుగా, ఎడారులుగా బాధ్యతగల పదవుల్లో వున్న నేతలు అభివర్ణిస్తోంటే, తాము గెలిపించిన ప్రజా ప్రతినిథులు ఏం చేస్తున్నారు.? వారికి పౌరుషం లేదా.? నైతికత లేదా.? అని ప్రజలు నిలదీస్తున్నారాయె. ఇక్కడ, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకొచ్చి చంద్రబాబుని విమర్శించడం కాదు.. అమరావతిలో ఓ రైతు, రాజధాని తరలిపోతుందనే ఆందోళనతో ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఆత్మహత్యాయత్నాన్ని అక్కడే వున్న మిగతా రైతులు భగ్నం చేశారు. ఆ రైతు ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేయాలి.
ఆందోళన చేస్తున్నవారంతా ఓ సామాజిక వర్గానికి చెందినవారే అన్నది వైసీపీ నేతల వాదన. ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కావొచ్చు, అమరావతి పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తోన్న మిగతా ప్రజా ప్రతినిథులు కావొచ్చు.. ఆ లెక్కలు తీయాలి. రైతుల వద్దకి వెళ్ళి, ‘మీది ఏ కులం.?’ అని ప్రశ్నించి, ఆధారాలు సేకరించి.. వాటిని బయటపెట్టాలి. అంతేగానీ, ప్రతిపక్షం మీద ఎగబడితే.. దానివల్ల ఎవరికి లాభం.?
605666 90569A weblog like yours should be earning considerably money from adsense.~::- 629332