వైద్యో నారాయణో హరి.. అన్నారు పెద్దలు. వైద్యుడ్ని దేవుడితో పోల్చుతాం. కానీ, కొంతమంది వైద్యులు కలెక్షన్ ఏజెంట్లుగా మారిపోయారు. ఆ మాటకొస్తే, వైద్యులంటే నర రూప రాక్షసులు.. అన్న భావన కూడా కొన్ని సందర్భాల్లో తెరపైకి వస్తోంది. పేషెంట్లను డబ్బు కోసం పీడించుకు తినే వైద్యులకు సంబంధించి ఎప్పటికప్పుడు మీడియాలో కథనాల్ని చూస్తూనే వున్నాం.
ప్రభుత్వాలు ‘ప్రైవేటు వైద్యానికి’ బ్రహ్మరథం పడ్తున్న దరిమిలా, ప్రజారోగ్యం అటకెక్కి.. వైద్య రంగం అనేది లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. ఇక, అసలు విషయానికొస్తే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఓ ప్రముఖ ఆసుపత్రిని ఈ రోజు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. వైద్యం సామాన్యుడికి అందుబాటులో వుండాలన్నారు.
సత్వర వైద్యం, సరసమైన ఖర్చుతో అందుబాటులోకి రావాల్సిన ఆవశ్యక్తను చాటిచెప్పారాయన. ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే అది సాధ్యమనీ సెలవిచ్చారు. కానీ, ఇప్పుడు ప్రైవేటు వైద్యం.. అంటే అదొక మాఫియాలా తయారైంది. దాదాపుగా ఆసుపత్రులన్నీ ఓ అవగాహనతో పేషెంట్లను దోచుకుంటున్నాయి. ఎక్స్రే, ఈసీజీ, స్కానింగ్.. ఇలా ప్రతి ఒక్కటీ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అనవసరమైన విషయాలకీ ఖరీదైన పరీక్షలు తప్పడంలేదు.
గతంలో ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన నరసింహన్, ప్రజారోగ్యంపై చాలా గట్టిగా మాట్లాడేవారు. ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారంపై కడిగి పారేసేవారు. కానీ, ప్రైవేటు వైద్యం ముసుగులో దోపీడీ మాత్రం ఆగలేదు. ఇప్పుడు సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి చెప్పినా, ప్రైవేటు వైద్యం దిగొచ్చ పరిస్థితి లేదు. కోట్లు వెచ్చించి ఖరీదైన ఆసుపత్రులు నిర్మించేది, అంతకు మించి సంపాదించడానికే తప్ప, సామాన్యుడికి సరసమైన ధరకు వైద్యాన్ని అందించడానికి కాదు కదా.!
377268 796512Your post is truly informative. Much more than that, it??s engaging, compelling and well-written. I would desire to see even more of these types of fantastic writing. 713825