Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: కృష్ణా వరదలో అమరావతి మునిగిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఎలాగైనా రాజధాని అమరావతిని చంపెయ్యాలన్నది వైసీపీ అనుకూల మీడియా కక్కుర్తి. అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్‌లో భాగమే. రాజధాని అనే విషయాన్ని పక్కన పెడితే, అమరావతి మీద వైసీపీకి, వైసీపీ అనుకూల మీడియాకి అంత అక్కసు ఎందుకు.? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు.

అమరావతి అంటే అక్కడ ఓ కులం మాత్రమే నివసిస్తోందని అనుకుంటే పొరపాటే. అక్కడ అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలున్నారు. కానీ, ఓ సామాజిక వర్గం పేరు చెప్పి అమరావతిని చంపెయ్యాలనే ప్రయత్నం జరుగుతోంది.

అమరావతిని గతంలో ముంపు ప్రాంతంగా ప్రకటించిన వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు (వీరిలో మంత్రులు కూడా వున్నారు), అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామంటున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక మాత్రం, ముంపు ప్రాంతమంటోంది.

ఇక, తాజాగా కృష్ణా నదికి వరద వచ్చింది. వైసీపీ హయాంలో ఇది రెండో వరద. మొదటి వరద సందర్భంలోనూ అమరావతిలోకి కృష్ణా నది నీళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి. అయితే, కొండవీటి వాగు నుంచి పెద్దయెత్తున నీరు.. కృష్ణా నదిలోకి ‘ఎత్తిపోతల పథకం’ ద్వారా వచ్చి చేరాయి. ఈ ఎత్తి పోతల పథకం లేకపోయి వుంటే, అమరావతి పరిధిలో కొన్ని గ్రామాల్లోని పంట పొలాలు మునిగిపోయేవని రైతులు చెబుతున్నారు. కేవలం ఎత్తిపోతల పథకం కారణంగానే తమకు ముంపు తగ్గిందన్నది రైతుల వాదన.

కానీ, వైసీపీ అనుకూల మీడియా మాత్రం.. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగమే లేదని తేల్చేసింది. రైతులకన్నా వైసీపీ అనుకూల మీడియాకే ఎక్కువ తెలుసా.? అన్నదిక్కడ కీలకమైన ప్రశ్న.

దశాబ్దాలుగా కొండవీటి వాగు నుంచి ముంపు ముప్పుని ఎదుర్కొంటున్నాయి అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాలు. ఇప్పుడు ఆ ముప్పు లేకుండా పోయిందన్నది ఆ ప్రాంత ప్రజల వాదన. అమరావతిలోకి నీళ్ళొచ్చేశాయ్‌.. రాజధానికి అనుకూల ప్రాంతం కాదు.. అని వైసీపీ అనుకూల మీడియా ఇంకోసారి గట్టిగా ప్రచారానికి తెరలేపడం కోసమే కృష్ణా నదికి వరదొచ్చినట్లుంది పరిస్థితి.

రాజకీయం కోసం ఏమైనా మాట్లాడతారా.? ప్రజల ఆలోచనలతో అధికారంలో వున్నోళ్ళకి అస్సలు సంబంధం వుండదా.? మరీ ఇంత దిగజారుడు రాజకీయమా.? ఏదిఏమైనా, అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్స్‌లోనూ తప్పుంది.. ప్రస్తుతం వైసీపీ తీరులోనూ తప్పుంది.. రాష్ట్రానికి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అభివృద్ధి కంటకులుగా మారిపోవడం.. అత్యంత దురదృష్టకరం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...