Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: కృష్ణా వరదలో అమరావతి మునిగిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఎలాగైనా రాజధాని అమరావతిని చంపెయ్యాలన్నది వైసీపీ అనుకూల మీడియా కక్కుర్తి. అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్‌లో భాగమే. రాజధాని అనే విషయాన్ని పక్కన పెడితే, అమరావతి మీద వైసీపీకి, వైసీపీ అనుకూల మీడియాకి అంత అక్కసు ఎందుకు.? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు.

అమరావతి అంటే అక్కడ ఓ కులం మాత్రమే నివసిస్తోందని అనుకుంటే పొరపాటే. అక్కడ అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలున్నారు. కానీ, ఓ సామాజిక వర్గం పేరు చెప్పి అమరావతిని చంపెయ్యాలనే ప్రయత్నం జరుగుతోంది.

అమరావతిని గతంలో ముంపు ప్రాంతంగా ప్రకటించిన వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు (వీరిలో మంత్రులు కూడా వున్నారు), అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామంటున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక మాత్రం, ముంపు ప్రాంతమంటోంది.

ఇక, తాజాగా కృష్ణా నదికి వరద వచ్చింది. వైసీపీ హయాంలో ఇది రెండో వరద. మొదటి వరద సందర్భంలోనూ అమరావతిలోకి కృష్ణా నది నీళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి. అయితే, కొండవీటి వాగు నుంచి పెద్దయెత్తున నీరు.. కృష్ణా నదిలోకి ‘ఎత్తిపోతల పథకం’ ద్వారా వచ్చి చేరాయి. ఈ ఎత్తి పోతల పథకం లేకపోయి వుంటే, అమరావతి పరిధిలో కొన్ని గ్రామాల్లోని పంట పొలాలు మునిగిపోయేవని రైతులు చెబుతున్నారు. కేవలం ఎత్తిపోతల పథకం కారణంగానే తమకు ముంపు తగ్గిందన్నది రైతుల వాదన.

కానీ, వైసీపీ అనుకూల మీడియా మాత్రం.. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగమే లేదని తేల్చేసింది. రైతులకన్నా వైసీపీ అనుకూల మీడియాకే ఎక్కువ తెలుసా.? అన్నదిక్కడ కీలకమైన ప్రశ్న.

దశాబ్దాలుగా కొండవీటి వాగు నుంచి ముంపు ముప్పుని ఎదుర్కొంటున్నాయి అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాలు. ఇప్పుడు ఆ ముప్పు లేకుండా పోయిందన్నది ఆ ప్రాంత ప్రజల వాదన. అమరావతిలోకి నీళ్ళొచ్చేశాయ్‌.. రాజధానికి అనుకూల ప్రాంతం కాదు.. అని వైసీపీ అనుకూల మీడియా ఇంకోసారి గట్టిగా ప్రచారానికి తెరలేపడం కోసమే కృష్ణా నదికి వరదొచ్చినట్లుంది పరిస్థితి.

రాజకీయం కోసం ఏమైనా మాట్లాడతారా.? ప్రజల ఆలోచనలతో అధికారంలో వున్నోళ్ళకి అస్సలు సంబంధం వుండదా.? మరీ ఇంత దిగజారుడు రాజకీయమా.? ఏదిఏమైనా, అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్స్‌లోనూ తప్పుంది.. ప్రస్తుతం వైసీపీ తీరులోనూ తప్పుంది.. రాష్ట్రానికి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అభివృద్ధి కంటకులుగా మారిపోవడం.. అత్యంత దురదృష్టకరం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...