ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్, గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిమిత్తం తనకు చెందిన 40 ఎకరాల భూమిని, చంద్రబాబు హయాంలో భూ సమీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, అశ్వనీదత్కి సీఆర్డీయే పరిధిలో భూమిని కేటాయించింది.
అయితే, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం, సీఆర్డీయేని రద్దు చేసి, ఆ స్థానంలో అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకురావడంతోపాటు, రాజధాని పరిధిని తగ్గించడం, అలాగే రాజధాని అమరావతి నుంచి శాసన మండలి మినహా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే, జ్యుడీషియల్ క్యాపిటల్ని విశాఖ, కర్నూలుకి తరలించనుండడం తెలిసిన విషయమే.
ప్రభుత్వం తనతో చేసుకున్న ఒప్పందానికి విలువ ఇవ్వలేదని ఆరోపిస్తూ, అశ్వనీదత్ హైకోర్టును ఆశ్రయించారు. తన భూమిని తనకు ఇచ్చేయాలని ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ ఆపేయాలని అశ్వనీదత్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. భూమి ఒకవేళ ఇవ్వలేని పక్షంలో, నష్టపరిహారంగా 210 కోట్లు ఇవ్వాలన్నది అశ్వనీదత్ డిమాండ్గా కనిపిస్తోంది. 40 ఎకరాలకు 210 కోట్లు అంటే.. 400 ఎకరాలకు 2100 కోట్లు.. 4000 ఎకరాలకు 21,000 కోట్లు.. 40,000 ఎకరాలకు 2,10,000 కోట్లు.!
మొత్తం రాజధాని అమరావతి కోసం 38 వేల ఎకరాల్ని రైతులు ఇచ్చిన దరిమిలా, వారంతా న్యాయస్థానాల్ని ఇలాంటి డిమాండ్లతోనే ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటట.? రాజధాని నిర్మించడానికి లక్ష కోట్లు ఖర్చవుతుందన్న వైసీపీ, టీడీపీ వాదనల్లో నిజమెంతోగానీ, నష్టపరిహారానికే 2 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తే.. అంతకన్నా దారుణం ఇంకోటుండదు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీల్ని తప్పితే.. ప్రజల నుంచి లాంటి ప్రతిఘటనలే ఎదురవుతాయి మరి.!
ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడిక వైసీపీ నేతలు ఎలాగూ ‘కులం’ ప్రస్తావన తీసుకొచ్చి నిస్సిగ్గు రాజకీయం షురూ చేస్తారనుకోండి అశ్వనీదత్ మీద.. అది వేరే సంగతి. అన్నట్టు, బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు కూడా ఇదే విషయమై కోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తాను ఇచ్చిన భూమికి నష్టపరిహారాన్ని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కృష్ణంరాజు.
196704 663829I like this blog very much so considerably good information . 827748