ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ జనరల్ డాక్టర్ అధోనామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు కేవలం వృద్దులు మాత్రమే భయపడాలని యువకులను కరోనా ఏం చేయలేదని కొందరు భావిస్తున్నారు. కాని అది నిజం కాదు. కరోనాకు ఎవరు అతీతులు కాదు. మూడు పదుల వయసులో ఉన్న వారు కరోనా బారిన పడటం మృతి చెందడం జరుగుతుందని కనుక ఏ ఒక్కరు కూడా ఛాన్స్ తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందే అంటూ అధోనామ్ హెచ్చరించాడు.
వృద్దులు మరియు చిన్న పిల్లల మాదిరిగా యువకులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటూ ఆయన పేర్కొన్నాడు. గతంలోనే ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ పేర్కొందని, కాని ఇంకా కూడా కొందరు యువకులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. యువకులు కూడా భయపడాల్సిందే అంటూ ఆయన మరోసారి పునరుద్ఘటించాడు. ప్రతి ఒక్కరు కూడా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని వ్యాక్సిన్ వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందంటూ పేర్కొన్నాడు.
856968 570020Quite clear website , regards for this post. 365366
32157 594123I dont agree with this particular post. Even so, I did researched in Google and Ive identified out that you are correct and I had been thinking inside the incorrect way. Continue producing quality material comparable to this. 635100