సినిమాల ప్రభావమో లేదా సోషల్ మీడియా ప్రభావమో కాని 15 యేళ్లు కూడా నిండకుండానే అబ్బాయిలు అత్యంత కఠినంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల బాలుడు తాను చదువుకునే స్కూల్లోనే చదువుకునే 9 యేళ్ల బాలికపై అఘాయిత్యంకు ఒడిగట్టాడు.
అతడు ఆడుకుందాం అంటూ మల్లె తోటలోకి అమ్మాయిని తీసుకువెళ్లి అఘాయిత్యంకు సిద్దం అయ్యాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి ప్రతిఘటించడంతో చేతికి అందిన రాయితో తలపై బలంగా కొట్టాడు. రాయితో బలంగా కొట్టడంతో ఆ అమ్మాయి తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పి పడిపోయింది. దాంతో భయపడ్డ ఆ బాలుడు వెంటనే ఊర్లోకి వెళ్లి విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు.
దాంతో పరుగు పరుగున అమ్మాయి తల్లిదండ్రులు అక్కడకి వెళ్లారు. ఏం తెలియనట్లుగా బాలుడు వారితో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి అనుమానంతో ఆ బాలుడిని ప్రశ్నించగా అసలు విషయంను ఒప్పుకున్నాడు. దాంతో అవాక్కయిన స్థానికులు బాలుడిపై దాడికి ప్రయత్నించారు. హస్పిటల్లో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
178050 209167How will be the new year going? I hope to read much more interesting posts like last year 880571