ఈ విపత్తు సమయంలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డ్యూటీ నిర్వహిస్తున్నారు. వారికి అవసరం అయిన మాస్క్లు మరియు శానిటైజర్స్ కూడా కొన్ని చోట్ల ఇవ్వడం లేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ భయంతో 500 మంది కానిస్టేబుల్స్ ఏకంగా డీసీపీపై దాడికి ప్రయత్నించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పెద్ద ఎత్తున కానిస్టేబుల్స్ దాడికి ప్రయత్నించడంతో వారిపై కేసు నమోదు చేయడం మాట అట్ల ఉంచి డీసీసీ అక్కడ నుండి పారిపోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఉమ్ఫున్ తుఫాను సహాయ కార్యక్రమాల కోసం 500 మందికి డీసీపీ డ్యూటీ వేశాడు. అయితే అందులో ఒక ఎస్సైకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ క్యాంపును శానిటైజేషన్ చేయించడంలో అలసత్వం చూపడంతో పాటు, అసలు కానిస్టేబుల్స్ ఆరోగ్యం విషయంలో పట్టనట్లుగా వ్యవహరించడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయ్యింది.
ఈ సమయంలోనే డీసీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆయన పట్టించుకోకుండా సమాధానం ఇచ్చాడు. దాంతో మరింతగా కోపం తెచ్చుకున్న పోలీసు కానిస్టేబుల్స్ డీసీపీపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బాధ్యలను ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు.
419184 317686Spot on with this write-up, I genuinely suppose this internet web site needs rather far more consideration. most likely be once far more to learn considerably a lot more, thanks for that info. 536551
752542 506633I adore reading and I conceive this website got some genuinely utilitarian stuff on it! . 102962
64165 370731I like this post, enjoyed this 1 thanks for posting . 654208