Switch to English

తెలంగాణలోనూ ‘లిక్కర్‌’.. మందుబాబులకి నో ‘ఫికర్‌’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,465FansLike
57,764FollowersFollow

తెలంగాణలో మద్యం అమ్మకాలకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉదయం 10 గంటలకు దుకాణాలు తెరుచుకుంటాయి.. సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచే మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ‘క్యూ’ కట్టేశారు. అయితే, భౌతిక దూరం (ఫిజికల్‌ డిస్టెన్స్‌) పాటించేలా మద్యం దుకాణాల వద్ద ఖచ్చితమైన ఏర్పాట్లు చేశారు.

పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరవడం ద్వారా, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో మందుబాబులు అటు వైపు వెళ్ళి వస్తున్నారనీ, తద్వారా కరోనా వ్యాప్తి తెలంగాణలో పెరిగే అవకాశం వుంటుందనీ, ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ మద్యం దుకాణాలు తెరవాల్సి వస్తుందని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మద్యం దుకాణాల పునఃప్రారంభంపై స్పష్టతనిచ్చారు.

అయితే, ఏ ఒక్క మద్యం షాపు వద్ద అయినా జనం గుమికూడినట్లు కన్పిస్తే, వెంటనే ఆ షాప్‌ బంద్‌ చేయించడం జరుగుతుందనీ కేసీఆర్‌ హెచ్చరించారు. ‘నో మాస్క్‌.. నో లిక్కర్‌’ పాలసీని అమలు చేస్తున్నామనీ, శానిటైజర్స్‌ కూడా మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు కేసీఆర్‌.

మరోపక్క, మద్యం ధరల్ని 11 నుంచి 16 శాతం వరకు పెంచుతున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ‘50 శాతం, 75 శాతం పొరుగు రాష్ట్రాల్లో పెంచుతున్నారు. మనం అలా చేయం. అత్యధికంగా 16 శాతం మాత్రమే పెంచుతున్నాం. చీప్‌ లిక్కర్‌పై 11 శాతమే పెరుగుతుంది’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. అయినాగానీ, ప్రస్తుత కరోనా భయానక పరిస్థితుల్లో మద్యం దుకాణాల్ని తెరవడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది సాధారణ ప్రజానీకం నుంచి.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, మద్యం అమ్మకాలతో మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుండడం గమనార్హం. ప్రార్థనా స్థలాల్లోకి ప్రజల్ని అనుమతించకపోవడమనేది కొనసాగుతుందని, విద్యా సంస్థల మూసివేత కొనసాగుతుందనీ చెబుతూ, మద్యం దుకాణాలకు అనుమతినివ్వడం ఆశ్చర్యకరమైన నిర్ణయమే. కానీ, పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ముప్పుతో పోల్చితే, తెలంగాణలో మద్యం దుకాణాలు తెరవడం ద్వారా కలిగే ముప్పు తక్కువే.. అన్న ప్రభుత్వ వాదనని పూర్తిగా కొట్టేయలేం కదా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...