Switch to English

వైసీపీ అభిమాని ఓపెన్ లెటర్: జగన్-వీసారె మధ్య చిచ్చు పెడుతున్న టీడీపి మీడియా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

బ్రిటిషర్లు భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో అమలు చేసిన వ్యూహం.. విభజించి పాలించడం. భారత్ లోని రాజులందరూ ఒక్కటిగా ఉంటే తమ పప్పులు ఉడకవని భావించి, బ్రిటిషర్లు వ్యూహాత్మకంగా తెరపైకి ఈ విధానాన్ని తీసుకొచ్చి విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే తరహాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య విభజన రేఖలు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే ఈ ఆదివారం రాసిన కొత్తపలుకును చదివితే అదే విషయం అర్థమవుతుంది. పరిస్థితులు ఎలాగున్నా.. ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్నా ఆయన టార్గెట్ మాత్రం సీఎం జగనే. ప్రతివారం జగన్ నామస్మరణ లేకుండా, ఆయనపై విమర్శలు చేయకుండా కొత్తపలుకు కలం కదలదంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు ఏది చేసినా మంచి, జగన్ ఏది చేసిన చెడే అన్నరీతిలో ఆయన కథనాలు ఉంటాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. తాజా కొత్తపలుకులో విజయసాయిరెడ్డి విశ్వాసంపై ఆర్కే సందేహాలు వెలిబుచ్చారు. గతంలో సుజనా చౌదరి వద్ద అకౌంటెంటుగా పనిచేసిన సాయిరెడ్డి.. ఆయన అప్పట్లో చేసిన అక్రమాలపై ఇప్పుడు పెదవి విప్పారని, ఇది వృత్తిపరమైన అనైతికేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు సుజనాను బెదిరించడం చూస్తుంటే, భవిష్యత్తులో జగన్ కు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదేమోనని ఆ కథనంలో అభిప్రాయపడ్డారు.

తరచి చూస్తే.. ఈ వ్యాఖ్యల వెనుక మర్మం సులభంగానే అర్థమవుతుంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, జగన్ కు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. నిజానికి విజయసాయిరెడ్డి జగన్ కు పెద్ద అసెట్ అంటూ గతంలో ఆర్కేనే స్వయంగా కొనియాడారు. అలాంటిది తాజాగా ఆయనే జగన్ మనసులో సాయిరెడ్డిపై అనుమానపు బీజాలు నాటాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది.

కానీ ఇక్కడ ఆర్కే ఒక విషయం మరచిపోయినట్టున్నారు. జగన్ ఆస్తుల కేసు విచారణ సందర్భంగా వన్ టూ వన్ విచారణలో జరిగిన విషయాలన్నీ ఆర్కేకి పూస గుచ్చినట్టు తెలిసిపోయేవి. విచారణాధికారి, నిందితుడు మాత్రమే ఉండే గదిలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా ఆయన పత్రికలో వచ్చేవి. అందువల్ల అప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆర్కేకి తెలియని విషయం అనుకోలేం.

ప్రతిరోజూ సీబీఐ కార్యాలయానికి విచారణ కోసం పిలిపించిన సాయిరెడ్డిని ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే కూర్చోబెట్టేవారని, అప్రూవర్ గా మారిపోవాలంటూ ఎంతగానో ఒత్తిడి చేశారని చాలామందికి తెలుసు. కానీ జగన్ వ్యతిరేకులు ఊహించిన సంఘటనలు ఏమీ జరగలేదు. భవిష్యత్తులో అలా జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. వైఎస్ కుటుంబంతో సాయిరెడ్డి అనుబంధం చాలాకాలంగా ఉంది. పైగా జగన్ సైతం ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నింటికీ మించి జగన్ కేసుల్లో సాయిరెడ్డి కూడా నిందితుడే.

అంతేకాకుండా టీడీపీ ఆరోపణలు చేసినట్టుగా లక్షల కోట్ల అక్రమాలు ఏమీ జరగలేదు. సీబీఐ విచారణలో చివరకు తేలిన అక్రమాల విలువ రూ.1500 కోట్ల లోపే. ఆ విషయాన్ని స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణే వెల్లడించారు. అసలు ఈ కేసు నిలిచే అవకాశమే లేదని సాక్షాత్తు ప్రభుత్వ సీఎస్ గా పనిచేసిన రమాకాంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారు.

ఒకవేళ నిజంగా అక్రమాలు జరిగి ఉంటే టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడే జగన్ కు శిక్ష వేయించి ఉండగలిగేది. ఇవన్నీ తెలిసి కూడా ఆర్కే ఇప్పుడీ ప్రయత్నం చేయడం వెనుక కారణాలు ఊహించడం చాలా సులభం. సాయిరెడ్డిపై జగన్ లో అనుమానం కలిగిస్తే.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన ప్రాధాన్యత తగ్గుతుందని, తద్వారా ఇద్దరి మధ్య దూరం పెరిగి జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతారేమోనన్న ఆశ మినహా మరేమీ ఇందులో కనిపించడంలేదు. కానీ అది జరిగే అవకాశం ప్రస్తుతానికైతే లేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...