బ్రిటిషర్లు భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో అమలు చేసిన వ్యూహం.. విభజించి పాలించడం. భారత్ లోని రాజులందరూ ఒక్కటిగా ఉంటే తమ పప్పులు ఉడకవని భావించి, బ్రిటిషర్లు వ్యూహాత్మకంగా తెరపైకి ఈ విధానాన్ని తీసుకొచ్చి విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే తరహాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య విభజన రేఖలు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే ఈ ఆదివారం రాసిన కొత్తపలుకును చదివితే అదే విషయం అర్థమవుతుంది. పరిస్థితులు ఎలాగున్నా.. ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్నా ఆయన టార్గెట్ మాత్రం సీఎం జగనే. ప్రతివారం జగన్ నామస్మరణ లేకుండా, ఆయనపై విమర్శలు చేయకుండా కొత్తపలుకు కలం కదలదంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు ఏది చేసినా మంచి, జగన్ ఏది చేసిన చెడే అన్నరీతిలో ఆయన కథనాలు ఉంటాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. తాజా కొత్తపలుకులో విజయసాయిరెడ్డి విశ్వాసంపై ఆర్కే సందేహాలు వెలిబుచ్చారు. గతంలో సుజనా చౌదరి వద్ద అకౌంటెంటుగా పనిచేసిన సాయిరెడ్డి.. ఆయన అప్పట్లో చేసిన అక్రమాలపై ఇప్పుడు పెదవి విప్పారని, ఇది వృత్తిపరమైన అనైతికేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు సుజనాను బెదిరించడం చూస్తుంటే, భవిష్యత్తులో జగన్ కు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదేమోనని ఆ కథనంలో అభిప్రాయపడ్డారు.
తరచి చూస్తే.. ఈ వ్యాఖ్యల వెనుక మర్మం సులభంగానే అర్థమవుతుంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, జగన్ కు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. నిజానికి విజయసాయిరెడ్డి జగన్ కు పెద్ద అసెట్ అంటూ గతంలో ఆర్కేనే స్వయంగా కొనియాడారు. అలాంటిది తాజాగా ఆయనే జగన్ మనసులో సాయిరెడ్డిపై అనుమానపు బీజాలు నాటాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది.
కానీ ఇక్కడ ఆర్కే ఒక విషయం మరచిపోయినట్టున్నారు. జగన్ ఆస్తుల కేసు విచారణ సందర్భంగా వన్ టూ వన్ విచారణలో జరిగిన విషయాలన్నీ ఆర్కేకి పూస గుచ్చినట్టు తెలిసిపోయేవి. విచారణాధికారి, నిందితుడు మాత్రమే ఉండే గదిలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా ఆయన పత్రికలో వచ్చేవి. అందువల్ల అప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆర్కేకి తెలియని విషయం అనుకోలేం.
ప్రతిరోజూ సీబీఐ కార్యాలయానికి విచారణ కోసం పిలిపించిన సాయిరెడ్డిని ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే కూర్చోబెట్టేవారని, అప్రూవర్ గా మారిపోవాలంటూ ఎంతగానో ఒత్తిడి చేశారని చాలామందికి తెలుసు. కానీ జగన్ వ్యతిరేకులు ఊహించిన సంఘటనలు ఏమీ జరగలేదు. భవిష్యత్తులో అలా జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. వైఎస్ కుటుంబంతో సాయిరెడ్డి అనుబంధం చాలాకాలంగా ఉంది. పైగా జగన్ సైతం ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నింటికీ మించి జగన్ కేసుల్లో సాయిరెడ్డి కూడా నిందితుడే.
అంతేకాకుండా టీడీపీ ఆరోపణలు చేసినట్టుగా లక్షల కోట్ల అక్రమాలు ఏమీ జరగలేదు. సీబీఐ విచారణలో చివరకు తేలిన అక్రమాల విలువ రూ.1500 కోట్ల లోపే. ఆ విషయాన్ని స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణే వెల్లడించారు. అసలు ఈ కేసు నిలిచే అవకాశమే లేదని సాక్షాత్తు ప్రభుత్వ సీఎస్ గా పనిచేసిన రమాకాంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారు.
ఒకవేళ నిజంగా అక్రమాలు జరిగి ఉంటే టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడే జగన్ కు శిక్ష వేయించి ఉండగలిగేది. ఇవన్నీ తెలిసి కూడా ఆర్కే ఇప్పుడీ ప్రయత్నం చేయడం వెనుక కారణాలు ఊహించడం చాలా సులభం. సాయిరెడ్డిపై జగన్ లో అనుమానం కలిగిస్తే.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన ప్రాధాన్యత తగ్గుతుందని, తద్వారా ఇద్దరి మధ్య దూరం పెరిగి జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతారేమోనన్న ఆశ మినహా మరేమీ ఇందులో కనిపించడంలేదు. కానీ అది జరిగే అవకాశం ప్రస్తుతానికైతే లేదు.
696901 278161 warning Dont any of you people ever take me to CiCis pizza! There food looks offensive!|Urban_Elegance| 916937
204760 470591As I internet site possessor I believe the content material here is really excellent , regards for your efforts. 986032
972239 127866Satisfying posting. It would appear that lots of the stages are depending upon the originality aspect. Its a funny thing about life if you refuse to accept anything but the best, you quite often get it. by W. Somerset Maugham.. 6575
956015 530627Oh my goodness! an incredible article dude. Thank you Nonetheless Im experiencing challenge with ur rss . Don know why Unable to subscribe to it. Is there anyone acquiring similar rss drawback? Anybody who knows kindly respond. Thnkx 102049
970996 773844I dont generally comment but I gotta state thanks for the post on this wonderful 1 : D. 272402
172529 139607Utterly composed subject material , thanks for selective info . 48223