Switch to English

గోటితో తీసేదానికి గొడ్డలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇసుక విధానం నుంచి ఆంగ్ల మాధ్యమం వరకు.. రాజధాని దగ్గర నుంచి శాసనమండలి రద్దు వరకు ఎన్నో విమర్శలు చవిచూసింది. వాస్తవానికి అవన్నీ చాలా సాధారణ అంశాలే. కాస్త నేర్పుగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. కానీ సర్కారు అనాలోచిత ధోరణో.. లేక ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చేవారు లేకనో ఆయా విషయాల్లో వ్యతిరేకత చవిచూడాల్సి వచ్చింది.

సరైన ఇసుక విధానం తీసుకురాకుండానే పాత విధానాన్ని రద్దు చేయడం.. వర్షాకాలంలో వరదలు రావడంతో ఇసుక కొరత ఏర్పడి ఏపీలోని నిర్మాణ రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. వర్షాకాలం వెళ్లే వరకు ఆగి, తగినంత ఇసుక సిద్ధం చేసుకున్న తర్వాత కొత్త విధానం తీసుకొస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలోనూ అదే విధానం అవలంభించి, హైకోర్టు చీవాట్లు తినాల్సి వచ్చింది.

ఇక రాజధాని తరలింపు విషయంలో సర్కారు వైఖరికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో 42 రోజులుగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. తాము రాజధానిని తరలించడంలేదని, మరో రెండు ప్రాంతాలకు విస్తరిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. ఆందోళనలు ఆగడంలేదు. వాస్తవానికి ఈ విషయంలో సర్కారు తెలివిగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మండలి రద్దు అంశంలోనూ జగన్ ప్రభుత్వం దూకుడే ప్రదర్శించింది. తమకు అడ్డంకిగా మారిన మండలిని రద్దు చేసింది.

అయితే, జగన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఎన్నో లోటుపాట్లు, ఇబ్బందులను అధిగమించి ఇసుక విధానం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లు మండలిలో ఆగిపోయింది. పైగా ఈ విషయంలో ముందుకెళ్లొద్దంటూ హైకోర్టు స్పష్టంచేసింది.

ఇక రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించిన బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపించింది. అంటే ఈ ప్రక్రియ తదుపరి దశకు వెళ్లాలంటే కనీసం నాలుగు నెలల జాప్యం తప్పదు. మండలి రద్దు వ్యవహారం కూడా అంతే. శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించడానికి ఎంత కాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు.

ఈ పరిస్థితులన్నీ వైసీపీ స్వయంకృతాపరాధాలే అంటున్నారు. గోటితో పరిష్కరించే సమస్యలకు ఏకంగా గొడ్డలి వాడుతోందని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి దూకుడు అన్ని విషయాల్లో, అన్ని వేళలా మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకనైనా వైసీపీ తెలివిగా వ్యవహరిస్తుందా లేక ఇదే రీతిన ముందుకెళ్తుందా అన్ని వేచి చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...