Switch to English

గోటితో తీసేదానికి గొడ్డలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇసుక విధానం నుంచి ఆంగ్ల మాధ్యమం వరకు.. రాజధాని దగ్గర నుంచి శాసనమండలి రద్దు వరకు ఎన్నో విమర్శలు చవిచూసింది. వాస్తవానికి అవన్నీ చాలా సాధారణ అంశాలే. కాస్త నేర్పుగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. కానీ సర్కారు అనాలోచిత ధోరణో.. లేక ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చేవారు లేకనో ఆయా విషయాల్లో వ్యతిరేకత చవిచూడాల్సి వచ్చింది.

సరైన ఇసుక విధానం తీసుకురాకుండానే పాత విధానాన్ని రద్దు చేయడం.. వర్షాకాలంలో వరదలు రావడంతో ఇసుక కొరత ఏర్పడి ఏపీలోని నిర్మాణ రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. వర్షాకాలం వెళ్లే వరకు ఆగి, తగినంత ఇసుక సిద్ధం చేసుకున్న తర్వాత కొత్త విధానం తీసుకొస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలోనూ అదే విధానం అవలంభించి, హైకోర్టు చీవాట్లు తినాల్సి వచ్చింది.

ఇక రాజధాని తరలింపు విషయంలో సర్కారు వైఖరికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో 42 రోజులుగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. తాము రాజధానిని తరలించడంలేదని, మరో రెండు ప్రాంతాలకు విస్తరిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. ఆందోళనలు ఆగడంలేదు. వాస్తవానికి ఈ విషయంలో సర్కారు తెలివిగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మండలి రద్దు అంశంలోనూ జగన్ ప్రభుత్వం దూకుడే ప్రదర్శించింది. తమకు అడ్డంకిగా మారిన మండలిని రద్దు చేసింది.

అయితే, జగన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఎన్నో లోటుపాట్లు, ఇబ్బందులను అధిగమించి ఇసుక విధానం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లు మండలిలో ఆగిపోయింది. పైగా ఈ విషయంలో ముందుకెళ్లొద్దంటూ హైకోర్టు స్పష్టంచేసింది.

ఇక రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించిన బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపించింది. అంటే ఈ ప్రక్రియ తదుపరి దశకు వెళ్లాలంటే కనీసం నాలుగు నెలల జాప్యం తప్పదు. మండలి రద్దు వ్యవహారం కూడా అంతే. శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించడానికి ఎంత కాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు.

ఈ పరిస్థితులన్నీ వైసీపీ స్వయంకృతాపరాధాలే అంటున్నారు. గోటితో పరిష్కరించే సమస్యలకు ఏకంగా గొడ్డలి వాడుతోందని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి దూకుడు అన్ని విషయాల్లో, అన్ని వేళలా మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకనైనా వైసీపీ తెలివిగా వ్యవహరిస్తుందా లేక ఇదే రీతిన ముందుకెళ్తుందా అన్ని వేచి చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...