ఏపీలో.. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో మహిళలపై జరిగిన అకృత్యాలు మరచిపోక ముందే మరో దారుణం జరిగింది. వారం రోజుల్లో నాలుగో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్ లో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. బాధిత మహిళ భర్తను కొట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
రేపల్లె రైల్వేస్టేషన్లో ముగ్గురు వ్యక్తులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అవనిగడ్డలో పనుల కోసం వలస కూలీలైన భార్యాభర్తలు నిన్న అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్ లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డకు బస్సులు లేకపోవడంతో స్టేషన్లోనే బల్లలపై పడుకున్నారు. గమనించిన ముగ్గురు వ్యక్తులు వచ్చి మహిళను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుపడిన భర్తపై దారుణంగా గాయపరిచారు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన వారిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులు స్థానికులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
767918 859497What a lovely weblog page. I will undoubtedly be back once again. Please keep writing! 953467
299280 430073I recognize there is a great deal of spam on this web site. Do you need aid cleaning them up? I may help in between courses! 240954