విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సత్తెనపల్లికి చెందిన సాయి గోపి పంపిన పార్శిల్ లో 4 కేజీల నార్కోటెక్ డ్రగ్స్ ఉన్నట్టు బెంగళూరులో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విజయవాడలోని డీటీఎస్ కేంద్రంగా కొరియర్ వెళ్లినట్టు తేలింది. కొరియర్ ను మొదటగా ఆస్ట్రేలియాకు పంపించగా.. అడ్రెస్ సరిగా లేక కెనడాకు వెళ్లింది. అయితే.. అక్కడి నుంచి కూడా వెనక్కు వచ్చిన సమయంలో బెంగళూరులో ఈ డ్రగ్స్ పార్శిల్ ను కనుగొన్నారు.
దీంతో ఏప్రిల్ 27న కొరియర్ బాయ్ ను బెంగుళూరుకు పిలిపించి విచారించారు. సాయి గోపి ఆధార్ కార్డ్ నకిలీదని తేలడంతో అరెస్ట్ చేశారు. అనంతరం అధికారులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. పార్శిల్ లో పిరిడిన్ అనే డ్రగ్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతంలో సాయి గోపి రెండుసార్లు పచ్చళ్లు పంపినట్టు పోలీసులు గుర్తించడంతో.. రెండుసార్లు ఏం పంపించాడనే దానిపై విచారిస్తున్నారు. గతంలో ఓసారి గుజరాత్ లో పట్టుబడిన డ్రగ్స్ విజయవాడ అడ్రెస్ తోనే ఉండటం గమనార్హం.
181021 233125There is noticeably plenty of dollars to recognize about this. I assume youve created certain good points in functions also. 62485