Switch to English

సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా ‘మూడు’పై న్యాయ పంచాయితీ ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

హైకోర్టు తీర్పు నచ్చకపోతే, సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం వుంటుంది. నిజానికి, మూడు రాజదానుల విషయంలో హైకోర్టు తుది తీర్పు ఇవ్వడానికి ముందే ఆ మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ సర్కారు రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు, అసలు న్యాయ వ్యవస్థపై అసెంబ్లీ సాక్షిగా పంచాయితీ ఎందుకు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేయడానికి సంబంధించి హైకోర్టు చీవాట్లు పెడితే, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి అక్కడా చీవాట్లు తిన్న ఘన చరిత్ర వైఎస్ జగన్ సర్కారుది. ఆ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో హైకోర్టు తీర్పుల్ని సుప్రీంకోర్టులో వైసీపీ సర్కారు సవాల్ చేసిన విషయం విదితమే. మరి, మూడు రాజధానుల విషయంలోనే ఎందుకీ ప్రత్యేకమైన గందరగోళం.?

మూడు రాజదానుల గందరగోళం నడుమ, మూడేళ్ళుగా రాజధాని అమరావతిలో ఎలాంటి అభివృద్ధీ లేకుండా పోయింది. నిజానికి, రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి అన్న ప్రస్తావన లేకుండా పోయింది. రాష్ట్ర ప్రజలెవరూ ఈ విషయాన్ని గుర్తించరన్న గుడ్డి నమ్మకం అధికార పార్టీ పెద్దల్లో చాలా గట్టిగా వుండబట్టే ఈ దుస్థితి. రాజధానిలో భూ కుంభకోణమన్నారు.. ఈ విషయమై కేసులు పెట్టి, నానా యాగీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసి, చివరికి సాధించింది ఏంటి.?

తమ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, తమ చేతకానితనానికి సెంటిమెంటు ముసుగేసేందుకు న్యాయ వ్యవస్థ పరిధిపై చర్చ.. అంటూ కొత్త వ్యవహారాన్ని వైఎస్ జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. నిజానికి, ఈ చర్చ అంటూ జరిగితే అది పార్లమెంటులో జరగాలి. వైసీపీ ఎంపీలు, పార్లమెంటులో ఈ వ్యవహారాల్ని ప్రస్తావిస్తున్నారా.? అంటే అదీ లేదు.

రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం చెప్పిన మాట వాస్తవం. కానీ, అలా రాష్ట్రం ఎప్పుడో రాజధానిపై నిర్ణయం తీసేసుకుంది కదా.! ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారుతుందా.? అలాగైతే, దేశ రాజధాని ప్రతి ఐదేళ్ళకూ మారిపోవాలి. దేశంలో పాతికో ముప్ఫయ్యో రాజధానులూ వుండాలి. ఇవన్నీ తెలియనంత అమాయకత్వం వైసీపీ అధినాయకత్వంలో వుందని ఎలా అనుకోగలం.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...