ఓ ప్రాంతాన్ని స్మశానంగా అభివర్ణించే హక్కు ఏ రాజ్యాంగం మంత్రులకు ఇచ్చింది.? రాజధాని కావాల్సిన ప్రాంతాన్ని ఎడారి అంటూ ఎగతాళి చేసేందుకు ఏ రాజ్యాంగం అధికార పార్టీ నాయకులకు ప్రత్యేకమైన హక్కుల్ని ఇచ్చింది.? అమరావతిని కమ్మరావతిగా అభివర్ణించడానికి ఎవరికైనా ఏ హక్కు వుంది.?
వ్యవస్థల గురించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన దరిమిలా, సాధారణ ప్రజానీకం నుంచి చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. మందు బాబులకు షాక్ కొట్టేలా ధరలు పెంచామన్నారు ఓ సారి. ఆ ప్రయోగం విఫలమవడంతో ధరలు తగ్గించి, జనాన్ని ఉద్ధరించేస్తున్నామని ప్రకటించారు. శాసన మండలి అంటే ఖర్చు దండగ వ్యవహారమన్నారు. శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. తిరిగి, అదే శాసన మండలికి సభ్యుల్ని నామినేట్ చేస్తున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత పరిస్థితి.
అధికారంలో వున్నవాళ్ళకి ఏ విషయమ్మీదా సంపూర్ణమైన అవగాహన లేదు. చీకట్లో బండి తోలుతున్నారని అనుకోవాలా.? లేదంటే, కళ్ళూ మూసేసుకుని ఇష్టమొచ్చినట్లు పరిగెడుతున్నారని అనాలా.? దేవాలయాలపై దాడులు జరిగితే, దోషులు పట్టుబడరు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే.. దోషి ఎవరో ఇప్పటిదాకా తేలలేదు. చెప్పుకుంటూ పోతే ఒకటా.? రెండా.? కోకొల్లలు.
తీసుకున్న ఏ నిర్ణయానికీ కట్టుబడి వుండలేని ‘నాయకత్వం’ రాష్ట్రానికి శాపంగా మారుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే మహిళలతో అసభ్యకరంగా వ్యవహరిస్తే నో పోలీస్.! అంతెందుకు, ఓ మంత్రి పోలీసు అధికారి మీద దారుసుగా ప్రవర్తిస్తే, ఆ మంత్రి మీద చర్యలుండవ్.!
ఇలాంటోళ్ళంతా కలిసి న్యాయ వ్యవస్థ పరిధి గురించి అసెంబ్లీలో చర్చించడమేంటి.? అంటూ జనం విస్తుపోతున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి వున్నామంటారు.. అమరావతిని స్మశానమంటారు. అంటే, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్నట్టా.? లేనట్టా.? రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడతామంటారు, మూడేళ్ళుగా అదే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులనీ, కూకట్పల్లి ఆంటీలనీ అసభ్యకరంగా మాట్లాడతారు. ఓ విధానమంటూ లేని రాజకీయమిది.
మంద బలం వుంటే, తాము చేసిందే చట్టమనుకుంటే పొరపాటు. వ్యవస్థలున్నది అడ్డగోలుగా వ్యవహరించే శక్తుల్ని కట్టడి చేయడానికే.!
259350 113363Its great as your other blog posts : D, thanks for posting . 273472
361005 220894How significantly of an exciting piece of writing, continue creating companion 195773