హైకోర్టు తీర్పు నచ్చకపోతే, సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం వుంటుంది. నిజానికి, మూడు రాజదానుల విషయంలో హైకోర్టు తుది తీర్పు ఇవ్వడానికి ముందే ఆ మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ సర్కారు రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు, అసలు న్యాయ వ్యవస్థపై అసెంబ్లీ సాక్షిగా పంచాయితీ ఎందుకు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేయడానికి సంబంధించి హైకోర్టు చీవాట్లు పెడితే, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి అక్కడా చీవాట్లు తిన్న ఘన చరిత్ర వైఎస్ జగన్ సర్కారుది. ఆ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో హైకోర్టు తీర్పుల్ని సుప్రీంకోర్టులో వైసీపీ సర్కారు సవాల్ చేసిన విషయం విదితమే. మరి, మూడు రాజధానుల విషయంలోనే ఎందుకీ ప్రత్యేకమైన గందరగోళం.?
మూడు రాజదానుల గందరగోళం నడుమ, మూడేళ్ళుగా రాజధాని అమరావతిలో ఎలాంటి అభివృద్ధీ లేకుండా పోయింది. నిజానికి, రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి అన్న ప్రస్తావన లేకుండా పోయింది. రాష్ట్ర ప్రజలెవరూ ఈ విషయాన్ని గుర్తించరన్న గుడ్డి నమ్మకం అధికార పార్టీ పెద్దల్లో చాలా గట్టిగా వుండబట్టే ఈ దుస్థితి. రాజధానిలో భూ కుంభకోణమన్నారు.. ఈ విషయమై కేసులు పెట్టి, నానా యాగీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసి, చివరికి సాధించింది ఏంటి.?
తమ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, తమ చేతకానితనానికి సెంటిమెంటు ముసుగేసేందుకు న్యాయ వ్యవస్థ పరిధిపై చర్చ.. అంటూ కొత్త వ్యవహారాన్ని వైఎస్ జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. నిజానికి, ఈ చర్చ అంటూ జరిగితే అది పార్లమెంటులో జరగాలి. వైసీపీ ఎంపీలు, పార్లమెంటులో ఈ వ్యవహారాల్ని ప్రస్తావిస్తున్నారా.? అంటే అదీ లేదు.
రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం చెప్పిన మాట వాస్తవం. కానీ, అలా రాష్ట్రం ఎప్పుడో రాజధానిపై నిర్ణయం తీసేసుకుంది కదా.! ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారుతుందా.? అలాగైతే, దేశ రాజధాని ప్రతి ఐదేళ్ళకూ మారిపోవాలి. దేశంలో పాతికో ముప్ఫయ్యో రాజధానులూ వుండాలి. ఇవన్నీ తెలియనంత అమాయకత్వం వైసీపీ అధినాయకత్వంలో వుందని ఎలా అనుకోగలం.?
454808 76158I like this website extremely significantly so a lot superb info . 354967
730932 12322Thanks for the data provided! I was researching for this article for a long time, but I was not able to see a dependable source. 944197