టెక్నాలజీ ఎంత పెరిగినా నేరాలూ, దోపిడీలు, దొంగతనాలు జరుగుతునే ఉన్నాయి. ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోపిడీలూ ఆగడం లేదు. ఈమధ్యే ఏపీలోని చిత్తూరు జిల్లాలో సెల్ ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ ను దుండగులు చేజ్ చేసి మరీ కోట్ల విలువైన సరుకును ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ లో మరో సెల్ ఫోన్ల దొంగతనం జరిగింది. లక్షల విలువైన సెల్ ఫోన్లను దొంగతనం చేశారు. కాకపోతే.. ఈసారి ఓ షోరూమ్ లో దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ శివారులోని మదీనాగూడలో ఉన్న రిలయన్స్ డిజిటల్ షోరూమ్ లో శనివారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. సుమారు 50 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఈరోజు ఉదయమే షాపు తెరిచారు సిబ్బంది. లోపలికి వెళ్లిన సిబ్బందికి సెల్ ఫోన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించారు. దొంగతనం జరిగినట్టు గుర్తించి వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్ధలానిక చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
షోరూమ్ లో మిగిలిన ఏఏ వస్తువులు చోరీకి గురయ్యాయో పరిశీలించారు. ఈ సందర్బంగా నిందితులను గాలించేందుకు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పండగ రోజునే చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
313811 449589Following I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any method youll be able to take away me from that service? Thanks! 449846
476057 892151so considerably good data on here, : D. 395176
274865 176529This internet internet site is my breathing in, truly good layout and perfect content material . 704761