వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు లభ్యమవడంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. కానీ కాసేపటి క్రితమే మరో రెండు మృతదేహాలు లాభం అవ్వడంతో మృతుల సంఖ్య 9కి చేరింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు.
దాదాపు 20 ఏళ్ల క్రితం బెంగాల్ నుంచి వచ్చి వరంగల్ లో స్థిరపడ్డ కుటుంబంగా భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. వీరంత ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాలు ఎండీ మక్సూద్ (50) ఆయన భార్య నిషా, కుమార్తె బుస్ర, ఆయన ఇద్దరు కుమారులు, మనవడిగా పోలీసులు భావిస్తున్నారు. ఆరు నెలలుగా వీరు వీరంతా గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తూ రెండు నెలలుగా అక్కడే ఉంటున్నారు. మక్సూద్ కుమార్తె కూడా భర్తతో విడిపోయి మనవడితో తండ్రి వద్దే నివసిస్తుంది. వీరితో పాటు మరో ఇద్దరు బీహార్ కు చెందిన యువకులు శ్రీరాం, శ్యాం కూడా ఉంటున్నారు.
పరిశ్రమ యజమాని సంతోష్ రోజులానే వచ్చి చూడగా అక్కడ వీరెవరూ కనిపించలేదు. చుట్టుపక్కల పరిసరాలతో పాటు సమీపంలోని బావిలో చూడగా వీరంతా మృతదేహాలు కనిపించాయని ఆయన చెప్పారు. పోలీసులకు సమాచారం అందించడటంతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను నగరపాలక సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సభ్యులు కలిసి మృతదేహాలను వెలికితీశారు.
బావిలో దొరికిన ఆ 9 మృతదేహాల గురించి వివరణ ఇచ్చిన వరంగల్ సీపీ రవీందర్:
27642 903145We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 878850
869142 930388There exist a couple of a lot of different distinct levels among the California Weight loss program and each and every a person is pretty critical. You are procedure stands out as the the actual giving up with all the power. weight loss 767423