సరదాగా ఆటలు ఆడుకుంటున్న ఆ చిన్నారులు కారులో కూడా సరదాగా కూర్చుందామని అనుకోవడమే వారు చేసిన తప్పు. కారు డోరు లాక్ కావడంతో అందులోనే మృతి చెందారు ఆ ముగ్గరు చిన్నారులు. అభం శుభం తెలీని ఆ చిన్నారుల పాలిట మృత్యు కుహారంగా మారింది ఆ కారు. అత్యంత విషాదం నింపిన ఈ ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో ముగ్గరు చిన్నారులు ఆడుకుంటూ సమీపంలోని కారులో కూర్చున్నారు. యధాపలంగా కారు డోరు వేయడంతో లాక్ పడిపోయింది. విషయం తెలయని వారికి ఉండేకొద్దీ ఊపిరి ఆడకుండా అయిపోయింది. దీంతో వారిపి ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలారు. ఆ పరిస్థితుల్లో వారినెవరూ గుర్తించ లేదు. పిల్లలు కనిపించటం లేదని వెతుకుతున్న తల్లిదండ్రులకు ఆ ముగ్గురూ కారులో విగతజీవులుగా పడి ఉండడం కనిపించింది. దీంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
స్థానిక సింటెక్స్ సంస్థకు చెందిన కార్మికుల క్వార్టర్స్లో ఈ ఘటన జరిగింది. చిన్నారులు ముగ్గురూ ఆరేళ్ల వయసు బాలికలే. వీరిలో ఇద్దరు పశ్చిమ బెంగాల్, ఒకరు అసోంకు చెందిన వారు. మృతుల పేర్లు సుహానా పర్విన్, యాస్మిన్, అఫ్సానా. చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
520611 153362Hi my friend! I want to say that this post is amazing, good written and contain approximately all significant infos. Id like to see more posts like this . 330398
520159 256648you can have an ideal blog correct here! would you prefer to make some invite posts on my weblog? 373569
679778 772516of course data entry services are really expensive that is why always make a backup of your files 605580