‘అమరావతిలో లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీనే అధికారంలో వుంది. మరి, చంద్రబాబు హయాంలో జరిగిన లక్ష కోట్ల కుంభకోణంపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు.? అమరావతితోపాటు, రాష్ట్రంలో మొత్తం మూడు రాజధానులంటూ హడావిడి చేస్తున్న ప్రభుత్వం, భూ కుంభకోణంపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..’ అంటూ బీజేపీ సీనియర్ నేత పీవీఎస్ శర్మ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధించారు.
ప్రస్తుతానికి బీజేపీ టార్గెట్ తెలుగుదేశం పార్టీగానే కన్పిస్తోంది. ‘మేం ఎవర్ని టార్గెట్ చేయాలో మాకు తెలుసు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై నిలదీస్తాం..’ అంటూ ఇటీవలే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఇక్కడ బీజేపీ ఓ విషయాన్ని ‘కన్వీనియెంట్గా’ మర్చిపోయినట్లు వ్యవహరిస్తోంది.
టీడీపీ – బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ని నాలుగేళ్ళపాటు పాలించాయి. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ఆ లెక్కన.. అమరావతిలో లక్ష కోట్ల విలువైన భూ కుంభకోణం అంటూ జరిగి వుంటే, దానికి నైతిక బాధ్యత ఎంతో కొంత బీజేపీ కూడా వహించాల్సి వుంటుంది కదా. బీజేపీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిథులు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంలో వున్నారు. ‘మేం టీడీపీతో కలిసి వున్నప్పుడూ అవినీతిని ప్రశ్నించాం..’ అని బీజేపీ నేతలు కొందరు చాలాకాలంగా పాత పాటే పాడుతున్నారనుకోండి.. అది వేరే విషయం. ఇంతకీ, అమరావతి విషయంలో బీజేపీ వైఖరి ఏంటి.? ఈ ప్రశ్నకు మాత్రం బీజేపీలో ఎవరి వద్ద కూడా సరైన సమాధానం దొరకదు.
ఇదిలా వుంటే, అమరావతిలో కొందరు మీడియా ప్రతినిథులకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పెద్దయెత్తున భూముల్ని కట్టబెట్టిందనీ, మీడియా సంస్థల అధిపతులూ పెద్దయెత్తున భూముల్ని దక్కించుకున్నారనీ ఆరోపణలు చాలాకాలంగా విన్పిస్తున్న విషయం విదితమే. ఈ అంశాన్నీ పీవీఎస్ శర్మ ప్రస్తావించారు. ‘ఆయా మీడియా సంస్థలు, మీడియా ప్రతినిథులూ.. స్వచ్ఛందంగా తాము పొందిన భూముల వివరాల్ని వెల్లడించాలి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా పీవీఎస్ శర్మ సవాల్ విసిరారు.
అమరావతి విషయంలో ఇప్పుడు నానా యాగీ చేస్తోన్న సదరు మీడియా సంస్థల అసలు ఆవేదన, తమకు దక్కిన భూముల విలువ తగ్గిపోతుందనేనన్నది రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ జరుగుతోన్న చర్చల సారాంశం.
Request all Telugu TV news channels& papers, to make full disclosure of their promoters/ shareholders/anchors/editors & their family concerns, stakes in the land dealings/holdings in Amaravati CRDA.
IT'S THE LEAST THEY CAN DO, in the interest of people of AP, lest it's a sham.— pvs sarma (@pvssarma) August 6, 2020
People of Andhra have the Constitutional Right, to know the extent of Corruption, Land Grabbing and Insider Trading that happened during @ncbn rule(2014-19) in Amaravati CRDA region.
WHO OWNS WHAT AND HOW MUCH?
Request @ysjagan garu to bring out White Paper on this issue soon.— pvs sarma (@pvssarma) August 6, 2020
అమరావతి రాజధాని పేరుమీద, ప్రజలను ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తూ, రెచ్చ గొట్టి ప్రతిఫలం పొందాలని చూస్తున్న రాజకీయ పార్టీలకు, నాయకులకు, తెలుగు సమాచార టీవీ లకు, ఒక విజ్ఞప్తి!
ప్రజలు అమాయకులేమో కానీ, మీకంటే తెలివిమంతులు కూడా, మీ చెత్త రాజకీయాలను గమనిస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త!— pvs sarma (@pvssarma) August 6, 2020