Switch to English

బీజేపీ గేమ్ ప్లాన్‌: టీడీపీతోపాటు పచ్చ మీడియాకీ షాక్ తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘అమరావతిలో లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీనే అధికారంలో వుంది. మరి, చంద్రబాబు హయాంలో జరిగిన లక్ష కోట్ల కుంభకోణంపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు.? అమరావతితోపాటు, రాష్ట్రంలో మొత్తం మూడు రాజధానులంటూ హడావిడి చేస్తున్న ప్రభుత్వం, భూ కుంభకోణంపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..’ అంటూ బీజేపీ సీనియర్‌ నేత పీవీఎస్‌ శర్మ సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తుత ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధించారు.

ప్రస్తుతానికి బీజేపీ టార్గెట్‌ తెలుగుదేశం పార్టీగానే కన్పిస్తోంది. ‘మేం ఎవర్ని టార్గెట్‌ చేయాలో మాకు తెలుసు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై నిలదీస్తాం..’ అంటూ ఇటీవలే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఇక్కడ బీజేపీ ఓ విషయాన్ని ‘కన్వీనియెంట్‌గా’ మర్చిపోయినట్లు వ్యవహరిస్తోంది.

టీడీపీ – బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ని నాలుగేళ్ళపాటు పాలించాయి. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ఆ లెక్కన.. అమరావతిలో లక్ష కోట్ల విలువైన భూ కుంభకోణం అంటూ జరిగి వుంటే, దానికి నైతిక బాధ్యత ఎంతో కొంత బీజేపీ కూడా వహించాల్సి వుంటుంది కదా. బీజేపీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిథులు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంలో వున్నారు. ‘మేం టీడీపీతో కలిసి వున్నప్పుడూ అవినీతిని ప్రశ్నించాం..’ అని బీజేపీ నేతలు కొందరు చాలాకాలంగా పాత పాటే పాడుతున్నారనుకోండి.. అది వేరే విషయం. ఇంతకీ, అమరావతి విషయంలో బీజేపీ వైఖరి ఏంటి.? ఈ ప్రశ్నకు మాత్రం బీజేపీలో ఎవరి వద్ద కూడా సరైన సమాధానం దొరకదు.

ఇదిలా వుంటే, అమరావతిలో కొందరు మీడియా ప్రతినిథులకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పెద్దయెత్తున భూముల్ని కట్టబెట్టిందనీ, మీడియా సంస్థల అధిపతులూ పెద్దయెత్తున భూముల్ని దక్కించుకున్నారనీ ఆరోపణలు చాలాకాలంగా విన్పిస్తున్న విషయం విదితమే. ఈ అంశాన్నీ పీవీఎస్‌ శర్మ ప్రస్తావించారు. ‘ఆయా మీడియా సంస్థలు, మీడియా ప్రతినిథులూ.. స్వచ్ఛందంగా తాము పొందిన భూముల వివరాల్ని వెల్లడించాలి..’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పీవీఎస్‌ శర్మ సవాల్‌ విసిరారు.

అమరావతి విషయంలో ఇప్పుడు నానా యాగీ చేస్తోన్న సదరు మీడియా సంస్థల అసలు ఆవేదన, తమకు దక్కిన భూముల విలువ తగ్గిపోతుందనేనన్నది రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ జరుగుతోన్న చర్చల సారాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...