దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్లీయర్ గా కనిపిస్తుంది. గత ఏడాది రోజులో లక్ష దాటని కేసులు ఇప్పుడు రెండు లక్షలు దాటాయి. నిన్న ఒక్క రోజే 2.1 లక్షల కేసులు నమోదు అయినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇలాంటి సందర్బంలో కరోనా పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు ఒక్క రోజులో రెండు లక్షలకు పైగా నమోదు అయిన దేశాల్లో ఇండియా మొదటి వరుసలో నిలిచింది. ఇప్పటికే ఈ జాబితాలో అమెరికా ఉంది. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే అమెరికాను క్రాస్ చేసి మరీ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 10 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రికవరీ శాతం ఇంతకు ముందు 97 శాతం ఉండేది. కాని ఇప్పుడు 88.31 శాతంకు పడిపోయినట్లుగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా మరణాల రేట్లు అధికంగా కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. 24 గంటల్లో రెండు లక్షల కేసులు దాటడం అంటే మామూలు విషయం కాదు. ఈ నెంబర్ మరెంతగా పెరుగుతుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.
860615 768342quite good post, i surely enjoy this incredible web site, persist in it 828328
318613 166537I think this is among the most vital information for me. And im glad reading your write-up. But wanna remark on couple of general issues, The web site style is perfect, the articles is really excellent : D. Good job, cheers 365579