దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ను మెల్లగా సడలిస్తూ వస్తున్నారు. అన్లాక్ 1.0 నేటితో ముగియబోతుంది. రేపటి నుండి అన్ లాక్ 2.0 పక్రియ ప్రారంభం కాబోతుంది. అందుకు గాను కేంద్ర పలు మార్గదర్శకాలను ఇచ్చింది. మొదటి అన్లాక్ లో పలు సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సమయంలో ఇంకా కొన్నింటికి కఠినంగా ఆంక్షలు మాత్రం ఉంటాయని పేర్కొన్నారు.
పాఠశాలలు, థియేటర్లు, కోచింగ్ సెంటర్లు, మాల్స్ ఓపెన్కు అనుమతులు లేవు. జిమ్ మరియు పార్క్లను ఇప్పట్లో ఓపెన్ చేసేది లేదంటూ తేల్చి చెప్పారు. జులై 31 వరకు ఈ విధానం కొనసాగబోతుంది. విమాన సర్వీస్లను మరియు రైళ్లను మరింతగా విస్తరించనున్నారు. ఆన్లైన్ మరియు దూర విద్యకు సంబంధించి మరింతగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రంకు రాకపోకలు కంటిన్యూ అవ్వడంతో పాటు సరకు రవాణను కూడా అడ్డుకోకూడదు అంటూ కేంద్రం నిర్ణయించింది. ఇక దేశ వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ మాత్రం యధావిధిగా కొనసాగబోతుంది.
879779 611560quite good put up, i really enjoy this internet website, keep on it 841753
375460 876342Thank you a lot for sharing this with all folks you in fact recognize what you are speaking about! Bookmarked. Please additionally talk more than with my internet web site =). We could have a hyperlink alternate arrangement among us! 167638